ETV Bharat / bharat

సద్గురు పెయింటింగ్​ విలువెంతో తెలుసా?

author img

By

Published : Feb 5, 2021, 7:41 AM IST

Updated : Feb 5, 2021, 7:57 AM IST

Sadhgurus Painting "Circa 2020"
సద్గురు పెయింటింగ్​ విలువెంతో తెలుసా?

'సద్గురు'గా సుప్రసిద్ధులైన యోగి, మార్మికులు, ఈశా ఫౌండేషన్​ వ్యవస్థాపకులు జగ్గీ వాసుదేవ్​.. ఓ పెయింటింగ్​ వేశారు. ఈ 'సిర్కా-2020' పెయింటింగ్​ ఆన్​లైన్​ వేలంలో రూ. 2.3 కోట్లు పలికింది.

ఈషా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీవాసుదేవ్‌ గీసిన సిర్కా-2020 పెయింటింగ్‌.. గురువారం నాటి ఆన్‌లైన్‌ వేలంలో రూ.2.3 కోట్లు పలికింది. ఫౌండేషన్‌ ద్వారా కరోనా సహాయక చర్యలకు ఈ నగదును ఉపయోగిస్తామని నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు.

Sadhgurus Painting
సిర్కా 2020 పేరుతో సద్గురు గీసిన చిత్రం

గతంలో సద్గురు రెండు పెయింటింగులు రూ.9.24 కోట్లకు విక్రయమయ్యాయి. ఈ మొత్తాన్ని కరోనా సహాయక చర్యలకు విరాళంగా ఇచ్చినట్లు ఫౌండేషన్‌ వెల్లడించింది.

ఇదీ చదవండి:బాలీవుడ్ ట్విట్టర్​ వార్​ వయా రైతు నిరసనలు

Last Updated :Feb 5, 2021, 7:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.