ETV Bharat / bharat

ఆ ఎంపీలకు టీ ఇచ్చిన డిప్యూటీ ఛైర్మన్​- ప్రధాని ప్రశంసలు

author img

By

Published : Sep 22, 2020, 10:20 AM IST

Updated : Sep 22, 2020, 11:48 AM IST

సస్పెండ్​ అయిన ఎనిమిది మంది రాజ్యసభ సభ్యుల దగ్గరకు వెళ్లి వారికి టీ ఇచ్చారు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్​ హరివంశ్. వారి దగ్గర కూర్చొని కాసేపు మాట్లాడారు. డిప్యూటీ ఛైర్మన్​పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు కురిపించారు.

RS Deputy Chairman serves tea to suspended MP's
ఆ ఎంపీలకు టీ తీసుకెళ్లిన డిప్యూటీ ఛైర్మన్​- ప్రధాని ప్రశంసలు

రాజ్యసభ నుంచి సస్పెండ్‌ అయి పోరు బాట పట్టిన ఎనిమిది మంది ఎంపీలకు టీ తీసుకెళ్లారు డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్​. అయితే హరివంశ్​ అందించిన టీ'ని ఎంపీలు ఎవరూ స్వీకరించలేదు. ఎంపీలు సభలో వ్యవసాయ బిల్లుల ఆమోదంపై గందరగోళం సృష్టించారనే ఆరోపణలతో సమావేశాలు పూర్తయ్యేంత వరకు సస్పెన్షన్‌ వేటు వేశారు. దీంతో ఆ ఎంపీలు పోరుబాట పట్టారు. వారు రాత్రంతా పార్లమెంట్​ ప్రాగణంలోని గాంధీ విగ్రహం వద్దే నిరసనలు చేశారు.

అయితే హరివంశ్​.. తోటి సభ్యుడిగానే తమను కలిశారని.. అంతేకానీ రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్​గా రాలేదన్నారు కాంగ్రెస్ ఎంపీ రిపున్​ బోర. 'తమను సస్పెండ్​ చేసినందుకు సోమవారం నుంచి నిరసనల ప్రదర్శిస్తున్నాం. రాత్రంతా ఇక్కడే గడిపాం. మా గురించి అడగడానికి ప్రభుత్వం నుంచి ఒక్కరు కూడా రాలేదు. కొంతమంది ప్రతిపక్షనేతలు మాకు సంఘీభావం తెలిపారు. మంగళవారం కూడా నిరసనలు కొనసాగిస్తాం' అని బోర చెప్పారు.

ఆ ఎంపీలకు టీ తీసుకెళ్లిన డిప్యూటీ ఛైర్మన్​- ప్రధాని ప్రశంసలు

ప్రధాని ప్రశంసలు

రాజ్యసభ నుంచి సస్పెండ్‌ అయిన ఎంపీలకు.. హరివంశ్‌ సింగ్‌ తేనీరు పంపడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. కొన్ని రోజుల కింద తనను అవమానించడమే కాకుండా ధర్నాకు కూర్చున్న వారిని హరివంశ్‌ పెద్ద మనసుతో ఆహ్వానించారని పేర్కొన్నారు. ఇది ఆయన గొప్పతనాన్ని సూచిస్తుందన్నారు ప్రధాని. హరివంశ్‌ సింగ్‌ను కొనియాడుతున్న వారిలో తాను చేరుతున్నానని ట్వీట్‌ చేశారు.

ఇదీ చూడండి: రాజ్యసభలో 8 మంది ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు

Last Updated :Sep 22, 2020, 11:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.