ETV Bharat / bharat

రక్షణశాఖలోని 9,304 ఇంజినీరింగ్ పోస్టుల రద్దు!

author img

By

Published : May 7, 2020, 5:36 PM IST

Rajnath Singh
ఎంఈఎస్​లో 9,304 పోస్టుల రద్దుకు రాజ్​నాథ్​ ఆమోదం!

మిలిటరీ ఇంజినీరింగ్​ సర్వీస్ (ఎంఈఎస్​)​లోని 9,304 పోస్టుల రద్దు ప్రతిపాదనకు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ ఆమోదం తెలిపినట్లు రక్షణ శాఖ వెల్లడించింది. లెఫ్టినెంట్​ జనరల్​ శెకత్కర్​ నేతృత్వంలోని కమిటీ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

మిలిటరీ ఇంజినీరింగ్​ సర్వీస్​(ఎంఈఎస్​)లోని సాధారణ, పారిశ్రామిక​ సిబ్బంది విభాగంలో ఖాళీగా ఉన్న మొత్తం 13,157 పోస్టుల్లో 9,304 పోస్టుల రద్దు ప్రతిపాదనకు రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ ఆమోదం తెలిపారు. ఈ మేరకు రక్షణ శాఖ ఓ ప్రకటన చేసింది.

లెఫ్టినెంట్​ జనరల్​ శెకత్కర్​ నేతృత్వంలోని కమిటీ సిఫార్సుల మేరకు రాజ్​నాథ్​ ఈ నిర్ణయం తీసుకున్నారని రక్షణ శాఖ వెల్లడించింది. సాయుధ దళాల రక్షణ వ్యయాన్ని సమతుల్యం చేయటం, పోరాట సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రతిపాదనలు చేసినట్లు తెలిపింది.

" ఎంఈఎస్​ను తక్కువ సిబ్బందితో సమర్థవంత సంస్థగా తీర్చిదిద్దటం, సంక్లిష్ట సమస్యలను సమర్థవంతంగా, తక్కవ ఖర్చుతో నిర్వహించేలా చేయటమే ఈ సిఫార్సుల ముఖ్య ఉద్దేశం. కమిటీ చేసిన సిఫార్సులలో ఒకటి.. సిబ్బందిని పునర్ వ్యవస్థీకరించటం. ఎంఈఎస్​లోని కొంత మేర పనిని డిపార్ట్​మెంటల్​ సిబ్బంది, ఇతర పనులను ఔట్​సోర్సింగ్​ ద్వారా చేయొచ్చు."

- రక్షణ శాఖ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.