ETV Bharat / bharat

'ఆత్మ నిర్భర్ యూపీ రోజ్​గార్' ప్రారంభించిన మోదీ

author img

By

Published : Jun 26, 2020, 11:45 AM IST

ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రూపొందించిన 'ఆత్మ నిర్భర్​ ఉత్తర్​ప్రదేశ్ రోజ్​గార్​ యోజన'ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. స్థానికంగా ఎంట్రప్రెన్యూర్​షిప్​ను ప్రోత్సహించడం... వలసకూలీలకు ఉపాధి కల్పించడమే ఈ పథకం లక్ష్యం.

Prime Minister Narendra Modi
'ఆత్మ నిర్భర్ యూపీ రోజ్​గార్ యోజన' ప్రారంభించిన మోదీ

​స్థానిక వ్యవస్థాపకత (ఎంట్రప్రెన్యూర్​షిప్​)ను ప్రోత్సహించడం, పారిశ్రామిక సంఘాల భాగస్వామ్యంతో ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రూపొందించిన 'ఆత్మ నిర్భర్ ఉత్తర్​ప్రదేశ్​ రోజ్​గార్ అభియాన్'ను వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ సహా పలువురు ముఖ్యనేతలు, అధికారులు పాల్గొన్నారు.

ఉత్తర్​ప్రదేశ్​లోని ఆరు జిల్లాల గ్రామస్థులతో వర్చువల్ వేదికగా మాట్లాడనున్నారు మోదీ. కామన్ సర్వీస్ సెంటర్లు, కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా.... రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం చేపడుతున్నారు.

కరోనా సంక్షోభం కారణంగా వలసకార్మికులు, శ్రామికులు ఉపాధి కోల్పోయి.. చాలా అవస్థలు పడుతున్నారు. అందువల్ల వారికి ప్రాథమిక సౌకర్యాలు, జీవనోపాధి కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలోనే ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వం... 'యూపీ ఉపాధి స్వావలంబన ప్రచారం' ప్రారంభించింది. స్థానిక ఎంట్రప్రెన్యూర్స్​ని ప్రోత్సహించడం, పరిశ్రమలు, ఇతర సంస్థలతో భాగస్వామ్యాన్ని ఏర్పరచి, ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యంగా పనిచేస్తోంది.

30 లక్షల మందికిపైగా..

కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి.. సుమారు 30 లక్షల మంది వలస కార్మికులు ఉత్తర్​ప్రదేశ్​లోని తమ ఇళ్లకు తిరిగివచ్చారు. అలాగే రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 25 వేలకు పైగా ప్రజలు తమ స్వస్థలాలకు చేరుకున్నారు.

ఇదీ చూడండి: వందే భారత్​ మిషన్: స్వదేశానికి 3.6 లక్షల మంది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.