ETV Bharat / bharat

14 మంది బలి- మృతుల్లో ఆరుగురు చిన్నారులు

author img

By

Published : Nov 20, 2020, 7:03 AM IST

Updated : Nov 20, 2020, 8:11 AM IST

accident
ఘోర రోడ్డు ప్రమాదం

07:42 November 20

వివాహ వేడుకకు వెళ్లి వస్తుండగా విషాదం..

ఉత్తర్‌ప్రదేశ్ ప్రతాప్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాగ్‌రాజ్-లఖ్‌నవూ రహదారిపై  ప్రయాణికులతో వెళ్తున్న జీపును ఓ ట్రక్కు ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఆరుగురు చిన్నారులున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. 

వివాహ వేడుకకు హాజరై తిరుగు ప్రయాణంలో..

షేక్​పుర్​ గ్రామంలో వివాహ వేడుకకు హాజరై తిరిగి స్వగ్రామానికి వస్తుండగా ప్రతాప్​గఢ్​ సమీపంలో ప్రమాదం జరిగింది. వాహనంపై డ్రైవర్​ నియంత్రణ కొల్పోయి అదుపుతప్పి మరో వాహనాన్ని ఢీ కొట్టినట్లు పోలీసులు తెలిపారు. 

మృతులు బాబు, దినేశ్​, పవన్​కుమార్​, దయరామ్​, అమాన్​, రామ్​సముజ్​, ఆశ్​, గౌరవ్​, నాన్​ భయ్యా, సచిన్​, హిమాన్ష్​, మితిలేశ్​, అభిమన్యూ, పరాస్​ నాథ్​ యాదవ్​గా గుర్తించారు. మృతుదేహాలను పోస్టు మార్టం నిమిత్తం తరలించినట్లు ఎస్పీ అనురాగ్​ ఆర్యా తెలిపారు. ఘటనపై వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించామన్నారు.

సీఎం విచారం..

ప్రతాప్​గఢ్​లో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు అవసరమైన అన్ని విధాల సాయం అందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. 

06:58 November 20

ఘోర రోడ్డు ప్రమాదం- 14 మంది మృతి

14
ఘోర రోడ్డు ప్రమాదం

ఉత్తర్​ప్రదేశ్​ ప్రతాప్​గఢ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాగ్​రాజ్​-లఖ్​నవూ రహదారిపై ఒక జీపును ట్రక్కు ఢీ కొట్టగా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఆరుగురు చిన్నారులున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

Last Updated : Nov 20, 2020, 8:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.