ETV Bharat / bharat

చితిలో సగం కాలిన మృతదేహాన్ని తీసుకెళ్లిన పోలీసులు

author img

By

Published : Oct 12, 2020, 1:39 PM IST

Police stop cremation and take dead body for autopsy
చితిలో సగం కాలిన మృతదేహాన్ని తీసుకెళ్లిన పోలీసులు

మధ్యప్రదేశ్​లో షాకింగ్ ఘటన జరిగింది. దహన సంస్కారాలను మధ్యలోనే ఆపి సగం కాలిన మృతదేహాన్ని తీసుకెళ్లారు పోలీసులు. చనిపోయిన వ్యక్తి హత్యకు గురయ్యాడనే అనుమానంతో ఇలా చేశారు.

మధ్యప్రదేశ్​ రాజ్​గఢ్​లో జరిగిన ఓ ఘటన స్థానికులను విస్మయానికి గురి చేసింది. బంధువుల సమక్షంలో జరగుతున్న దహన సంస్కారాలను మధ్యలోనే ఆపి సగం కాలిన మృతదేహాన్ని తీసుకెళ్లారు పోలీసులు. అనంతరం భౌతికకాయాన్ని పంచనామాకు తరలించారు. తన భర్తను బంధువులు హత్య చేశారని భార్య చేసిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలకు ఉపక్రమించారు.

ప్రేమ్​సింగ్​, రేఖా భాయ్​ అనే దంపతుల మధ్య నెల రోజుల క్రితం గొడవ జరిగింది. అనంతరం పుట్టింటికి వెళ్లిపోయి అక్కడే ఉంటోంది రేఖ. ఇటీవల అనారోగ్యానికి గురైన భర్త శనివారం మరణించాడు. ఈ విషయాన్ని భార్యకు తెలియజేయకుండానే అంత్యక్రియలు నిర్వహించారు బంధువులు.

విషయం తెలుసుకున్న రేఖా భాయ్ పోలీసులను ఆశ్రయించింది. తన భర్తను బంధువులే హత్య చేసి ఉంటారని ఆరోపించింది. హూటాహుటిన బయలుదేరిన పోలీసులు అప్పటికే మొదలైన దహన సంస్కారాలు ఆపి శవాన్ని పోస్ట్​ మార్టమ్​కు పంపారు. అనంతరం మృతదేహాన్ని బంధువులకు తిరిగి అప్పగించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.