ETV Bharat / bharat

చైనాతో ఉద్రిక్తతల మధ్య మోదీ- ట్రంప్​ ఫోన్​ సంభాషణ

author img

By

Published : Jun 2, 2020, 10:00 PM IST

Updated : Jun 2, 2020, 11:32 PM IST

భారత​ ప్రధాని మోదీ- అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ మధ్య మంగళవారం టెలిఫోన్​ సంభాషణ జరిగింది. కరోనా వైరస్​ సహా ఇతర అంశాలపై చర్చించినట్టు మోదీ ట్వీట్​ చేశారు. అయితే చైనాతో భారత సరిహద్దు సమస్యతో పాటు.. అమెరికాలో నెలకొన్న ఆందోళనలపై ఇరు దేశాధినేతలు చర్చించినట్టు పీఎంవో స్పష్టం చేసింది.

PM Narendra Modi had a telephone conversation today with US Pres Donald Trump.
సరిహద్దు ఉద్రిక్తత మధ్య మోదీ- ట్రంప్​ ఫోన్​ సంభాషణ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​తో సంభాషించినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. కరోనా మహమ్మారి సహా ఇతర అంశాలపై చర్చించినట్టు ట్వీట్​ చేశారు.

  • Had a warm and productive conversation with my friend President @realDonaldTrump. We discussed his plans for the US Presidency of G-7, the COVID-19 pandemic, and many other issues.

    — Narendra Modi (@narendramodi) June 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"నా మిత్రుడు డొనాల్డ్​ ట్రంప్​తో ఫలవంతమైన సంభాషణ జరిగింది. జీ-7లో అమెరికా అధ్యక్షతపై ట్రంప్​కున్న ప్రణాళికలు, కరోనా వైరస్​తో పాటు ఇతర సమస్యలను చర్చించాం."

--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.


సరిహద్దు వివాదంపైనా...

ఇరు దేశాధినేతలు భారత్​-చైనా సరిహద్దు వద్ద నెలకొన్న పరిస్థితులపై చర్చించారని ప్రధాని కార్యాలయం(పీఎంవో) ప్రకటన విడుదల చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థలో చేపట్టాల్సిన సంస్కరణలపై అగ్రనేతలు సమాలోచనలు చేసినట్లు చెప్పింది.

అమెరికాలో నల్లజాతీయుడు ఫ్లాయిడ్ మృతికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలపై మోదీ ఆందోళన వ్యక్తం చేశారని సమాచారం. పరిస్థితులు త్వరగా సాధారణ స్థితికి రావాలని ట్రంప్​తో సంభాషణలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో అమెరికాలో జరగనున్న తదుపరి జీ-7 దేశాల సదస్సుకు మోదీని ఆహ్వానించారు ట్రంప్​.

Last Updated : Jun 2, 2020, 11:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.