ETV Bharat / bharat

పీఎం కేర్స్​ నిధులతో ఆ రాష్ట్రంలో రెండు కొవిడ్​ ఆస్పత్రులు

author img

By

Published : Aug 24, 2020, 4:53 PM IST

PM CARES to fund two 500-bed COVID hospitals in Bihar
పీఎం కేర్స్​ నిధులతో ఆ రాష్ట్రంలో రెండు కొవిడ్​ ఆస్పత్రులు

బిహార్​లో కొవిడ్​ వ్యాప్తి దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం. పీఎం సహాయ నిధి ద్వారా.. ఆ రాష్ట్రంలో రెండు 500 పడకల కొవిడ్​ ఆస్పత్రులను ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపింది.

బిహార్​లో కొవిడ్​ కేసులు అంతకంతకూ పెరుగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి సహాయ నిధి(పీఎం కేర్స్​ ఫండ్​) కింద రెండు 500 పడకల కొవిడ్​ తాత్కాలిక ఆస్పత్రులకు నిధులను సమకూర్చనుంది. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం ట్విట్టర్​ ద్వారా వెల్లడించింది. ఈ 500 పడకలలో.. 125 అత్యవసర చికిత్స విభాగం(ఐసీయూ), 375 సాధారణ చికిత్సకు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పింది పీఎంఓ. సాయుధ బలగాలకు చెందిన పారా మెడికల్​ సిబ్బంది ఈ ఆస్పత్రుల్లో సేవలందించనున్నారు.

PM CARES to fund two 500-bed COVID hospitals in Bihar
బిహ్తాలోని కొవిడ్​ కేర్​ ఆస్పత్రి
PM CARES to fund two 500-bed COVID hospitals in Bihar
బిహ్తా వైద్యశాలలోని పడకలు

పట్నాలోని బిహ్తాలో సోమవారం ఓ ఆస్పత్రిని ప్రారంభిస్తున్నట్లు పీఎంఓ స్పష్టం చేసింది. త్వరలోనే ముజఫర్​నగర్​లో మరో వైద్యశాలను ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చింది.

PM CARES to fund two 500-bed COVID hospitals in Bihar
కొవిడ్​ కేర్​ ఆస్పత్రి

ఇదీ చదవండి: 'భాజపాతో కుమ్మక్కు'పై కాంగ్రెస్​లో రగడ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.