ETV Bharat / bharat

ఉగ్రవాదులకు ఆయుధాల సరఫరాలో పాక్​ కొత్త పంథా

author img

By

Published : Aug 6, 2020, 6:16 PM IST

డ్రోన్లు ఉపయోగించి జమ్ముకశ్మీర్‌లోని ఉగ్రవాదులకు ఆయుధాలు పంపేందుకు పాకిస్థాన్ కొత్త పద్ధతిని అవలంబిస్తోందని డీజీపీ దిల్బాగ్​ సింగ్ ​తెలిపారు. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలను పలు ప్రాంతాల్లో గుర్తించినట్లు ఆయన వెల్లడించారు.

Pak trying to sneak weapons into J-K using UAVs: DGP Dilbag Singh
ఉగ్రవాదులకు ఆయుధాల సరఫరాలో పాక్​ కొత్త పద్ధతి!

భారత్​లో ఉగ్రవాదాన్ని ఎగదోసేందుకు పాకిస్థాన్ కొత్త కుట్రలకు పాల్పడుతోందని జమ్ముకశ్మీర్‌ డీజీపీ దిల్బాగ్​ సింగ్ వెల్లడించారు. డ్రోన్ల సాయంతో ముష్కరులకు ఆయుధాలు, పేలుడు పదార్థాలను సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తోందని​ తెలిపారు. గతంలోనూ జమ్ముకశ్మీర్​కు ట్రక్కుల ద్వారా ఆయుధాలను తరలిస్తున్న పాక్​ దుశ్చర్యలను చేధించినట్లు గుర్తుచేశారు.

కశ్మీర్​లోని కుప్వారా, హీరానగర్​, కతువా, రాజౌరి ప్రాంతాల్లో.. ఆయుధాలను తీసుకెళ్తున్న పాక్​ డ్రోన్లను చేధించినట్లు దిల్బాగ్ చెప్పారు. జమ్ముకశ్మీర్‌లో ప్రస్తుతం 200 మందిలోపే ఉగ్రవాదులు ఉన్నారని తెలిపారు. భద్రతా బలగాల ప్రత్యేక ఆపరేషన్​ల వల్ల ఈ ఏడాది కేవలం 26 మంది ముష్కరులే భారత భూభాగంలోకి చొరబడినట్లు వివరించారు.

దిల్బాగ్​ తెలిపిన మరిన్ని కీలక అంశాలు

  • భారత్​లో పని చేస్తున్న ముష్కరులకు భారీగా ఆయుధాల కొరత ఏర్పడింది. వారికి ఆయుధాలను తరలించేందుకు కొత్త మార్గాలను ఎంచుకొంటోంది పాక్​.
  • దేశంలోకి ఉగ్రవాదులు చొరబడేలా అవకాశం కల్పించడానికే సరిహద్దుల్లో కాల్పులను ముమ్మరం చేసింది పాకిస్థాన్​​.
  • 2019లో 267 సార్లు సరిహద్దుల్లో దాడులకు పాల్పడిన దాయాది... 2020లో తొలి ఏడు నెలల్లోనే 75 శాతం అధికంగా (487సార్లు) కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది​.
  • అయితే ఈ ఏడాది 150 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాయి భారత భద్రత సిబ్బంది. వారిలో 39 మంది కమాండర్ స్థాయి అధికారులు, మరో 30 మంది విదేశీయులు.
  • కొన్నేళ్ల క్రితం 300 నుంచి 350 మంది ఉన్న ఉగ్రవాదులను ప్రత్యేక ఆపరేషన్ల ద్వారా 200 కంటే దిగువకు తగ్గించగలిగాయి భద్రత దళాలు.
  • హవాలా, వెస్ట్రన్ యూనియన్​ మనీ ట్రాన్స్​ఫర్​, టిఫిన్​ బాక్సుల కొరియర్ ద్వారా డబ్బు పంపే అన్ని మార్గాలకు అడ్డుకట్ట వేశాం.
  • ఉగ్రదాడులు 70 శాతం మేర తగ్గాయి. 2019లో తొలి ఏడు నెలల్లో 198 సార్లు ముష్కరులు దాడులకు పాల్పడగా.. 2020 అదే సమయంలో 124 ఉగ్రదాడులు జరిగాయి.
  • ఈ ఏడాదిలో 36 మంది భద్రతా సిబ్బంది అమరులయ్యారు. మరో 102మంది గాయపడ్డారు.

ఇదీ చూడండి: రామాలయంపై పాక్​ విమర్శలను తిప్పికొట్టిన భారత్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.