ETV Bharat / bharat

''ఫిట్​ ఇండియా'లో భాగస్వాములుగా 10కోట్ల మంది'

author img

By

Published : Oct 2, 2020, 10:21 PM IST

Over 10 crore people have participated in 'Fit India' campaign: Rijiju
10 కోట్ల పైగా 'ఫిట్ ఇండియా'లో పాల్గొన్న ఔత్సాహికులు!

'ఫిట్ ​ఇండియా' ప్రచార కార్యక్రమంలో 10 కోట్లమందికి పైగా ఔత్సాహికులు పాల్గొన్నారని కేంద్ర క్రీడల మంత్రి కిరణ్​ రిజిజు తెలిపారు. దేశ ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యమే ధ్యేయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు వెల్లడించారు.

ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన 'ఫిట్​ ఇండియా' ప్రచార కార్యక్రమంలో ఇప్పటివరకు 10 కోట్ల మందికి పైగా ఔత్సాహికులు పాల్గొన్నారని కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. కార్యక్రమం ప్రచారంపై సమీక్ష నిర్వహించిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ ప్రచారంలో భాగంగా సీఆర్​పీఎప్​ దివ్యాంగుల దళాలు... అహ్మదాబాద్‌లోని సబర్మతీ ఆశ్రమం నుంచి దిల్లీకి 16 రోజుల్లో 1,000 కిలోమీటర్ల సైకిల్​ ర్యాలీ పూర్తి చేసిన సందర్భంగా మట్లాడారు రిజిజు. ఈ సైకిల్​ ర్యాలీ.. శాంతి, దృఢ సంకల్పం, అభిరుచి వంటి సందేశాలు ఇస్తుందన్నారు. దీని వల్ల చాలా మందిలో ప్రేరణ కలుగుతుందన్నారు. 'దేశ పౌరుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో ఈ ప్రచారాన్ని ప్రారంభించారు' అని రాజ్‌ఘాట్‌లో జరిగిన సెంట్రల్​ రిజర్వ్​ పోలీస్​ ఫోర్స్​(సీఆర్​పీఎఫ్​)ర్యాలీలో రిజిజు తెలిపారు.

దేశ ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యమే ధ్యేయంగా జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఫిట్​ ఇండియా ఉద్యమాన్ని 2019, ఆగస్టు 29న ప్రారంభించారు మోదీ.

ఇదీ చూడండి: 'ఫిట్​నెస్​ ప్రోటోకాల్స్​'ను ప్రారంభించిన మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.