ETV Bharat / bharat

ఇప్పుడు భాజపా వంతు.. గుజరాత్​కు ఎమ్మెల్యేలు

author img

By

Published : Aug 8, 2020, 9:18 PM IST

Now-BJPs-turn:-Six-MLAs-shifted-to-Gujarat
ఇప్పుడు భాజపా వంతు..గుజరాత్​కు ఎమ్మెల్యేలు

రాజస్థాన్​ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. మొన్నటి వరకు సీఎం అశోక్​ గహ్లోత్​ తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలను రిసార్టులకు తరలించగా.. ఇప్పుడు భాజపా వంతు వచ్చింది. అరుగురు ఎమ్మెల్యేలను గుజరాత్​కు తరలించింది. ఇప్పటికే 23మంది ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్లినట్లు సమాచారం.

అసెంబ్లీ సమావేశాలకు తేదీ దగ్గర పడుతున్న వేళ రాజస్థాన్‌లో రాజకీయం మళ్లీ వేడెక్కుతోంది. నిన్నటి వరకు తిరుగుబాటు నేత సచిన్‌ పైలట్‌ వర్గం ఎమ్మెల్యేలు ఓ చోట... సీఎం అశోక్‌ గహ్లోత్‌ వర్గం ఎమ్మెల్యేలు మరో చోట రిసార్టుల్లో తలదాచుకున్నారు. ఇప్పుడు భాజపా వంతు వచ్చింది. అశోక్‌ గహ్లోత్‌ ఒత్తిళ్ల నుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు వారిని గుజరాత్‌ తరలిస్తోంది.

ఈ నెల 14 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో భాజపాకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు శనివారం జైపుర్‌ విమానాశ్రయం నుంచి ఛార్టెడ్‌ విమానంలో గుజరాత్‌లోని పోర్‌బందర్‌కు తరలివెళ్లారు. ఇప్పటికే 23 మంది ఎమ్మెల్యేలు తరలి వెళ్లినట్లు సమాచారం. సుమారు 40 మంది ఎమ్మెల్యేలను ఈ విధంగా ఆ పార్టీ తరలించనున్నట్లు తెలుస్తోంది.

తమను రాష్ట్ర పోలీసులు వేధిస్తున్నారని, అందుకు ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా తీర్థయాత్రలకు వెళ్తున్నట్లు శనివారం తరలివెళ్లిన ఆరుగురు ఎమ్మెల్యేల్లో ఒకరైన అశోక్‌ లహోతి పేర్కొన్నారు. మరోవైపు ఎమ్మెల్యేల తరలింపు వార్తలను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్‌ పునియా తోసిపుచ్చారు. ఎమ్మెల్యేలందరూ ఐక్యంగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీనే కావాలని లేనిపోని ప్రచారాలను వెలుగులోకి తెచ్చి గందరగోళాన్ని సృష్టిస్తోందన్నారు. అయితే, భాజపా ఎమ్మెల్యేలు పోర్‌బందర్‌ వెళ్లడాన్ని ఎయిర్‌పోర్ట్‌ వర్గాలు కూడా ధ్రువీకరించాయి.

ఇదీ చూడండి: దిల్లీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.