ETV Bharat / bharat

షాకింగ్ న్యూస్​: మరో 276 మంది భారతీయులకు కరోనా

author img

By

Published : Mar 18, 2020, 3:59 PM IST

ఇరాన్​లో దాదాపు 255 మంది భారతీయులకు కరోనా వైరస్​ సోకినట్లు తాజాగా వెల్లడించింది విదేశాంగ శాఖ. ఇటలీ, యూఏఈ, రువాండా, శ్రీలంక, కువైట్​, హాంగ్​కాంగ్​ తదితర దేశాలను కలిపి మొత్తం దాదాపు 276మంది భారతీయులకు ఈ మహమ్మారి సోకినట్లు ప్రకటించింది.

MEA confirms 255 Indians test positive for COVID-19 in Iran
మరో 276 మంది భారతీయలకు కరోనా!

ప్రపంచవ్యాప్తంగా దాదాపు మరో 276 మంది భారతీయులు కరోనా బారిన పడ్డట్లు వెల్లడించింది విదేశాంగ శాఖ. ఒక్క ఇరాన్​లోనే దాదాపు 255 మంది భారతీయులకు ఈ మహమ్మారు సోకినట్లు తాజాగా ధ్రువీకరించింది. వీరితో పాటు యూఏఈలో 12 మంది, ఇటలీలో అయిదుగురు, శ్రీలంక, రువాండా, కువైట్​, హాంగ్​కాంగ్​లో ఒక్కో భారతీయుడు కరోనా బారిన పడ్డట్లు విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్​ ప్రకటించారు.

చైనాకు లక్షల మాస్కులు

చైనాకు లక్ష సాధారణ మాస్కులు, మరో లక్ష వైద్య చికిత్స మాస్కులు, 4000 ఎన్​-95 మాస్కులతో పాటు ఐదు లక్షల జతల చేతి తొడుగులను ఎగుమతి చేసినట్లు మురళీధరన్​ తెలిపారు. భారత వైమానిక దళానికి చెందిన సీ-17 ప్రత్యేక విమానం ద్వారా వీటన్నింటినీ వుహాన్​కు చేర్చినట్లు స్పష్టం చేశారు. ఇరుదేశాల మధ్య స్నేహానికి గుర్తుగానే వీటిని చైనాకు అందించామన్నారు మురళీధరన్​.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.