ETV Bharat / bharat

మహారాష్ట్రలో 9వేలు దాటిన కరోనా కేసులు-మృతులు 400

author img

By

Published : Apr 28, 2020, 11:58 PM IST

మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 9వేలు దాటింది. రాష్ట్రంలో ఇవాళ 729 కొత్త కేసులు బయటపడగా, 31 మంది మృతి చెందారు.

Maha COVID-19 tally over 9,000 with 729 new cases, 31 deaths
మహారాష్ట్రలో 9వేలు దాటిన కరోనా కేసులు-మృతులు 400

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే దేశంలో వైరస్​ కేంద్రబిందువుగా మారిన రాష్ట్రంలో ఇవాళ ఒక్కరోజే కొత్తగా 729 కొవిడ్​-19 పాజిటివ్​ కేసులను గుర్తించారు అధికారులు. వీటితో కలిపి మహారాష్ట్రలో మొత్తం వైరస్​ కేసుల సంఖ్య 9వేలు దాటింది. కొత్తగా 31 మంది మృత్యువాతపడగా కరోనా మరణాల సంఖ్య 400కు చేరింది.

మహారాష్ట్రలో ప్రస్తుతం కరోనా వివరాలు

  • మొత్తం కేసులు-9,318
  • డిశ్చార్జ్​ అయినవారు-1,388
  • యాక్టివ్​ కేసులు-7,530
  • మరణాలు-400
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.