ETV Bharat / bharat

రేపే కమల్​నాథ్ సర్కార్​కు బలపరీక్ష..​ సర్వత్రా ఉత్కంఠ

author img

By

Published : Mar 15, 2020, 6:48 AM IST

Updated : Mar 15, 2020, 4:39 PM IST

Madhya Pradesh political crisis
రేపే కమల్​నాథ్ సర్కార్​కు బలపరీక్ష

మధ్యప్రదేశ్​లో రేపటి నుంచి ఏప్రిల్ 13 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటుతో కమల్​నాథ్ ప్రభుత్వానికి కష్టకాలం దాపురించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలందరికీ విప్ జారీ చేసింది. బడ్జెట్ సెషన్​లో ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయాలని ఆదేశించింది.

రేపే కమల్​నాథ్ సర్కార్​కు బలపరీక్ష..​ సర్వత్రా ఉత్కంఠ

మధ్యప్రదేశ్​లో రేపే కమల్​నాథ్ సర్కార్ భవితవ్యం తేలనుంది. మార్చి 16 నుంచి ఏప్రిల్ 13 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలు ప్రారంభమయ్యే మొదటి రోజే (మార్చి 16) తన (గవర్నర్) ప్రసంగం పూర్తి అయిన వెంటనే అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నిర్వహించనున్నట్లు మధ్యప్రదేశ్​ గవర్నర్ లాల్జీ టాండన్​ తెలిపారు. ముఖ్యమంత్రి కమల్​నాథ్​ శాసనసభలో బలనిరూపణ చేసుకోవాలని ఆయన ఆదేశించారు.

"22 మంది ఎమ్మెల్యేలు స్పీకర్​కు రాజీనామాలు పంపారని, వారు ఈ విషయాన్ని ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాల ద్వారా తెలియజేసినట్లు నాకు తెలిసింది. మీడియా కవరేజీని నేను శ్రద్ధగా గమనించాను."- లాల్జీ టాండన్​, మధ్యప్రదేశ్ గవర్నర్​ (ముఖ్యమంత్రికి రాసిన లేఖలో)

కాంగ్రెస్​ విప్ జారీ

మధ్యప్రదేశ్​లో అధికార​ కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలు అందరికీ విప్ జారీ చేసింది. మార్చి 16 నుంచి ఏప్రిల్ 13 వరకు నిర్వహించే అసెంబ్లీ సమావేశాలకు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించింది. బడ్జెట్ సెషన్​లో ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయాలని స్పష్టం చేసింది.

ఈ మేరకు కాంగ్రెస్ చీఫ్ విప్​, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి డా. గోవింద్​ సింగ్​.. ఎమ్మెల్యేలకు విప్ జారీ చేశారు. అసెంబ్లీ సమావేశాలకు పార్టీ సభ్యులందరూ కచ్చితంగా హాజరవ్వాలని ఆదేశించారు.

జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్​ను కాదని భాజపా తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు 22 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఈ నేపథ్యంలో కమల్​నాథ్​ ప్రభుత్వం దినదిన గండంగా నడుస్తోంది.

రాజీనామాలకు ఆమోదం

మధ్యప్రదేశ్ శాసనసభ స్పీకర్​ ఎన్​పీ ప్రజాపతి... ఆరుగురు తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించారు. వీరంతా కమల్​నాథ్ ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసినవారే.

"ఇమారతి దేవి, తులసీ సీలావత్​, గోవింద్ సింగ్ రాజ్​పుత్​, మహేంద్ర సింగ్ సిసోడియా, ప్రద్యుమ్న్ సింగ్ తోమర్​, ప్రభురామ్​ చౌదరిల రాజీనామాలను ఆమోదించాను."- ప్రజాపతి, మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్

స్పీకర్ తాజా నిర్ణయంతో మధ్యప్రదేశ్ అసెంబ్లీలో సభ్యుల ప్రస్తుత ఎమ్మెల్యేల సంఖ్య 222కి చేరింది. మరో రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి. కమల్​నాథ్​ ప్రభుత్వాన్ని నిలుపుకోవాలంటే 112 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం.

ప్రత్యేక పూజలు

కమల్​నాథ్ ప్రభుత్వాన్ని సంక్షోభంలోకి నెట్టిన తిరుగుబాటు ఎమ్మెల్యేలు దేవాలయాలను జోరుగా సందర్శిస్తున్నారు. రాజస్థాన్​ జైపూర్​లోని ప్రసిద్ధ ఖుతుష్యమ్ ఆలయంతో సహా పలు ఆలయాలను సందర్శించి ప్రార్థనలు చేస్తున్నారు.

దీనికి విరుగుడుగా రాష్ట్రమంత్రి పీసీ శర్మ... అగర్​ మాల్వా జిల్లాలోని ప్రసిద్ధ బాగ్లాముఖి ఆలయంలో అగ్నికర్మ నిర్వహించారు. కాంగ్రెస్​లో సంక్షోభం లేదని ఆయన స్పష్టం చేశారు. బాగ్లాముఖి ఆలయం 'తాంత్రిక' (క్షుద్ర) ఆచారాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ భక్తులు తమ కోరికలు నెరవేర్చుకోవడం కోసం 'హవాన్​' (అగ్ని కర్మ) చేస్తారు.

ఇదీ చూడండి: కరోనాను ఎదుర్కోవాలంటే.. ఆ 30రోజులే కీలకం.?

Last Updated :Mar 15, 2020, 4:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.