ETV Bharat / bharat

వైరల్​: పెళ్లైన 58 ఏళ్లకు ఘనంగా ఫొటోషూట్

author img

By

Published : Oct 4, 2020, 2:50 PM IST

కేరళలో ఓ వృద్ధ జంటకు 1962లో వివాహమైంది. అయితే.. ఇంతవరకూ అందుకు సంబంధించిన ఫొటో జ్ఞాపకాలేవీ లేవని ఫీలవుతున్న వేళ.. తమ మనుమడి సాయంతో ఇటీవలే ఓ ఫొటోషూట్​ నిర్వహించారు. ఇప్పుడే పెళ్లైందా అన్నట్టుగా దిగిన ఆ వృద్ధ దంపతుల ఫొటోలిప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయ్యాయి.

Wedding photoshoot after 58 yrs of marriage goes viral
వైరల్​: పెళ్లైన 58 ఏళ్లకు ఘనంగా ఫొటో షూట్

నేటి తరంలో ప్రతి ఫోజుకో సెల్ఫీ.. ప్రతి కొత్త లుక్కుకు ఓ ఫొటో.! పిక్​ ఏదైనా సరే.. దిగిన మరుక్షణమే సోషల్​ మీడియాలో అప్​లోడ్​ చేసేయాల్సిందే. కానీ.. కేరళలో ఓ వృద్ధ జంట ఇందుకు భిన్నం. వివాహమై 50ఏళ్లు దాటినా ఇంతవరకు ఇద్దరూ కలిసి ఒక్క ఫొటో కూడా దిగలేదట. అయితే ఇటీవలే ఆ లోటు తీర్చుకున్నారు కుంజుట్టి, చిన్నమ్మ దంపతులు. పెళ్లైన 58 ఏళ్ల తర్వాత వారు జరుపుకున్న ఈ ఫొటోషూట్​.. సోషల్​ మీడియాలో తెగ వైరల్​ అవుతోంది.

Kerala: Wedding photoshoot after 58 years of marriage goes viral
పెళ్లైన 58 ఏళ్లకు ఘనంగా ఫొటో షూట్
Kerala: Wedding photoshoot after 58 years of marriage goes viral
పెళ్లైన 58 ఏళ్లకు ఘనంగా ఫొటో షూట్

1962 జనవరి 1న కుంజుట్టి, చిన్నమ్మలకు వివాహమైంది. అయితే.. అప్పట్లో ఫొటోగ్రాఫర్​ అందుబాటులో లేకోనో, మరే ఇతర కారణంగానో పెళ్లిలో ఫొటోలు దిగలేదట. ఆ కోరికను ఇప్పుడు తమ మనుమడి సాయంతో తీర్చుకుని.. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఇప్పుడే పెళ్లైన జంటగా దిగిన ఈ వృద్ధుల ఫొటోషూట్​ చూస్తే.. కరోనా కాలంలోనూ ఇంత గొప్పగా వివాహం జరిగిందా? అనిపించక మానదు.

Kerala: Wedding photoshoot after 58 years of marriage goes viral
పెళ్లైన 58 ఏళ్లకు ఘనంగా ఫొటో షూట్
Kerala: Wedding photoshoot after 58 years of marriage goes viral
పెళ్లైన 58 ఏళ్లకు ఘనంగా ఫొటో షూట్

ఇదీ చదవండి: కళకళలాడే కశ్మీర్​ అందాల్లో 'పాంపోర్'​ కుంకుమపువ్వు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.