ETV Bharat / bharat

కరోనా పంజా: 'మహా'లో 15లక్షలు దాటిన కేసులు

author img

By

Published : Oct 9, 2020, 8:22 PM IST

Updated : Oct 9, 2020, 10:40 PM IST

దేశంలో కొవిడ్​ కేసులు స్థిరంగా పెరుగుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో వైరస్​ వ్యాప్తి అధికంగా ఉంది. కర్ణాటకలో ఒక్కరోజులోనే 10వేల మందికిపైగా మహమ్మారి బారినపడ్డారు. మహారాష్ట్రలో మరో 12వేల కొవిడ్​ కేసులు బయటపడగా.. బాధితుల సంఖ్య 15లక్షలు దాటింది.

Kerala adds 9,250 new COVID-19 cases, 25 deaths take toll to 955
కేరళ, తమిళనాట కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి

దేశంలో వైరస్​ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. మహారాష్ట్రలో మరో 12,134 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. బాధితుల సంఖ్య 15,06,018కి పెరిగింది. వైరస్​ సోకిన వారిలో మరో 302 మంది చనిపోయారు. దీంతో మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 39,732కు చేరింది.

  • కర్ణాటకలో ఒక్కరోజులోనే 10,913 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మొత్తం కేసుల సంఖ్య 6,90,269కు పెరిగింది. మరో 114 మరణాలతో కలిపి.. ఇప్పటివరకు అక్కడ మొత్తం 9,789 మృతిచెందారు.
  • కేరళలో ఒక్కరోజు వ్యవధిలోనే 9,250 మంది కరోనా బారినపడ్డారు. ఫలితంగా బాధితుల సంఖ్య 2,66,100కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 955 వైరస్​ మరణాలు నమోదయ్యాయి.
  • తమిళనాట మరో 5,185 కరోనా కేసులు వెలుగుచూశాయి. మరో 68 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం బాధితుల సంఖ్య 6,46,128కు చేరింది.
  • ఉత్తర్​ప్రదేశ్​లో శుక్రవారం 3,249 మందికి కరోనా సోకింది. మొత్తం కేసుల సంఖ్య 4,30,666కు పెరిగింది. వైరస్​ కారణంగా మరో 48 మంది చనిపోగా.. మొత్తం మరణాలు 6,293కి చేరాయి.
  • దిల్లీలో మరో 2,860 కేసుల్ని గుర్తించారు. మొత్తం కేసుల సంఖ్య 3,03,693కు చేరింది. ఇవాళ 39 మంది కొవిడ్​కు బలయ్యారు.
  • రాజస్థాన్​లో కొత్తగా 2,180 వైరస్​ కేసులు బయటపడ్డాయి. రాష్ట్రంలో మొత్తం కేసులు 1,54,785కు.. మరణాలు 1621కి పెరిగాయి.

ఇదీ చదవండి: అంగన్​వాడీ కేంద్రం నిర్మాణానికి 'ప్లాస్టిక్​ ఇటుకలు'

Last Updated : Oct 9, 2020, 10:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.