ETV Bharat / bharat

'ఇందిరా, అమ్మ' క్యాంటీన్​లతో పేదల ఆకలికి చెక్​

author img

By

Published : Mar 31, 2020, 7:48 AM IST

కరోనా వైరస్​ను నియంత్రించేందుకు దేశం లాక్​డౌన్​లోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో తమ రాష్ట్రంలో ఆకలితో అల్లాడుతున్న పేదలను ఆదుకుంటోంది కర్ణాటకలోని ఇందిరా క్యాంటీన్​. పేదలకు ప్రతిరోజు ఉచిత భోజనం అందిస్తోంది. తమిళనాడు ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే అమ్మ క్యాంటీన్​ కూడా అతి తక్కువ ధరలకే పేదలకు భోజనం పెడుతోంది.

Indira Canteen which came to feed hungry during crisis.
లాక్​డౌన్​ వేళ పేదలకు ఉచిత భోజనం

'ఇందిరా, అమ్మ' క్యాంటీన్​లతో పేదల ఆకలికి చెక్​

దేశంలో లాక్​డౌన్ వేళ పేదల పరిస్థితి దయనీయంగా మారింది. పేదలు, వలస కార్మికులు, రోజువారీ కూలీలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆకలితో అల్లాడుతున్నారు. కర్ణాటకలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో.. వారికి అండగా నిలుస్తోంది ఇందిరా క్యాంటీన్​. ఆకలితో అలమటిస్తున్న పేద ప్రజలకు ప్రతిరోజు కడుపు నిండా తిండి పెడుతోంది. ఉచిత భోజనం అందిస్తూ వారి ఆకలిని తీరుస్తుంది.

ఇందిరా క్యాంటీన్​కు ప్రజలు తరలివెళ్తున్నారు. కరోనా వైరస్​ నేపథ్యంలో.. ఆహారం కోసం క్యూలో నిలబడే వారు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటోంది.

పేదలకు అతి తక్కువ ధరకే భోజనం అందించాలని.. 2017 ఆగస్టు 16వ తేదీన ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇందిరా క్యాంటీన్​ను ప్రారంభించారు. అప్పటినుంచి అల్పాహారం రూ.5, మధ్యాహ్నం, రాత్రి భోజనాన్ని రూ.10కే అందజేస్తోంది.

అక్కడ అమ్మ క్యాంటీన్​..

కర్ణాటకలో ఇందిరా క్యాంటీన్​ తరహాలోనే.. తమిళనాడులో దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రారంభించిన అమ్మ క్యాంటీన్లు ఎందరో పేదలకు అక్షయ పాత్రగా మారాయి. ప్రస్తుతం ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నడుస్తున్న ఈ క్యాంటీన్ల ద్వారా అతి తక్కువ ధరకే అల్పాహారం, భోజనం అందిస్తున్నారు. రూపాయికే ఇడ్లీ, రూ. 3కు పెరుగన్నం, ఇతర భోజనం 5 రూపాయలకే అందిస్తూ ఆదర్శంగా నిలుస్తోందీ పళనిస్వామి సర్కార్​. హోటళ్లు, మెస్​లను నమ్ముకున్న ఉద్యోగస్తులు, పేదలు ఇంకా ఎందరో ప్రస్తుత లాక్​డౌన్​ పరిస్థితుల్లో అమ్మ క్యాంటీన్లపైనే ఆధారపడుతున్నారు.

ఇదీ చూడండి : 'కరోనా వైరస్​ కన్నా భయమే అతి పెద్ద సమస్య'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.