ETV Bharat / bharat

దేశంలో మరో 66 వేల కరోనా కేసులు

author img

By

Published : Oct 12, 2020, 9:39 AM IST

దేశవ్యాప్తంగా కొత్తగా 66 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 816 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 70 లక్షల 74 వేలకు చేరగా.. మరణాల సంఖ్య 1,09,150కి పెరిగింది. ఆదివారం ఒక్కరోజే 9.9 లక్షల కరోనా పరీక్షలు జరిగాయి.

INDIA CORONA CASES
దేశంలో కరోనా కేసులు

దేశంలో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రతీరోజు కొత్త కేసులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఆదివారం మరో 66,732 మందికి కరోనా సోకినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్​లో తెలిపింది. మరో 816 మంది మరణించారు.

  • మొత్తం కేసుల సంఖ్య: 71,20,539
  • మొత్తం మరణాలు: 1,09,150
  • కోలుకున్నవారు: 61,49,536
  • రికవరీ రేటు: 86.36%
  • మరణాల రేటు: 1.53%

ఆదివారం 9,94,851 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. ఇప్పటివరకు చేసిన నమూనా పరీక్షల సంఖ్య 8,78,72,093కు చేరినట్లు వెల్లడించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.