ETV Bharat / bharat

దేశంలో మరోసారి 20వేల దిగువకు కరోనా కేసులు

author img

By

Published : Dec 27, 2020, 9:55 AM IST

Updated : Dec 27, 2020, 11:06 AM IST

దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. కొత్తగా 18,732 మందికి కరోనా సోకినట్టు తేలింది. మరో 279 మంది వైరస్​తో ప్రాణాలు కోల్పోయారు.

INDIA REPORTS 18,732 NEW COVID-19 POSITIVE CASES AND 279 DEATHS IN LAST 24 HOURS
దేశంలో మరోసారి 20వేలకు దిగువన కరోనా కేసులు

దేశంలో మరోసారి 20వేలకు దిగువన కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా 18,732 మందికి కొవిడ్ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మొత్తం బాధితుల సంఖ్య 1కోటీ 1లక్షా 87వేల 850కి పెరిగింది. వైరస్​ ధాటికి మరో 279 మంది బలవ్వగా.. మృతుల సంఖ్య 1లక్షా 47వేల 622కు చేరింది.

Statewide corona cases details
రాష్ట్రాల వారీగా కరోనా కేసుల వివరాలు

ఇదీ చదవండి: ఎందుకు కొవిడ్-19 అని పిలుస్తారు?

రికవరీ రేటు ఇలా..

తాజాగా 21,430 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. ఫలితంగా కరోనాను జయించిన వారి సంఖ్య 97లక్షల 61వేల 538కి చేరింది. 2లక్షల 78వేల 690 యాక్టివ్​ కేసులున్నాయి. దేశవ్యాప్త రికవరీ రేటు 95.82 శాతానికి ఎగబాకింది. మరణాల రేటు స్థిరంగా 1.45 శాతంగా నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

దేశవ్యాప్తంగా శనివారం మరో 9లక్షల 43వేల నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్​) వెల్లడించింది. దీంతో మొత్తం టెస్ట్​ల సంఖ్య 16 కోట్ల 81లక్షలు దాటింది.

ఇదీ చదవండి: కొత్త వైరస్​పై కొవిడ్ టాస్క్​ఫోర్స్ సమీక్ష

Last Updated : Dec 27, 2020, 11:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.