ETV Bharat / bharat

దేశంలో మరో 13,052 కేసులు..127 మరణాలు

author img

By

Published : Jan 31, 2021, 9:59 AM IST

దేశంలో కొవిడ్-19 ఉద్ధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. తాజాగా 13,052 వైరస్​ కేసులు బయటపడ్డాయి. మొత్తం బాధితుల సంఖ్య 1కోటీ 7లక్షల 46వేలకు పెరిగింది. దేశవ్యాప్త రికవరీ రేటు 96.99 శాతంగా నమోదైంది.

INDIA REGISTERED 13,052 NEW COVID-19 POSTIVE CASES AND 127 DEATHS IN LAST 24 HOURS
దేశంలో మరో 13,052 కేసులు.. 127 మరణాలు

దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 13,052 మందికి కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. వైరస్​ కారణంగా మరో 127 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • మొత్తం కేసులు: 10,746,183
  • యాక్టివ్ కేసులు: 1,68,784
  • కోలుకున్నవారు: 1,04,23,125
  • మొత్తం మరణాలు: 1,54,274

వైరస్​ సోకిన వారిలో మరో కొత్తగా 13,965 మంది కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఫలితంగా దేశవ్యాప్త రికవరీ రేటు 96.99 శాతానికి పెరగ్గా.. మరణాల రేటు స్థిరంగా 1.44 శాతంగా ఉంది.

మరోవైపు.. దేశంలో శనివారం రోజు సుమారు 2.44 లక్షల మందికి టీకా అందించినట్టు తెలిపింది ఆరోగ్యశాఖ. ఇప్పటివరకు సుమారు 37.44 లక్షల మందికి వ్యాక్సిన్​ పంపిణీ చేసినట్టు పేర్కొంది.

ఇదీ చదవండి: ఈ పదేళ్లు ఎంతో కీలకం: మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.