ETV Bharat / bharat

'భారత్​లో పెట్టుబడులకు ఇదే మా ఆహ్వానం'

author img

By

Published : Jul 22, 2020, 9:35 PM IST

Updated : Jul 23, 2020, 1:03 AM IST

India invites you to invest in defence & space
భారత్​లో పెట్టబడుల పెట్టాలని అమెరికాను కోరిన మోదీ

భారత్​లో ఆరోగ్య, సంరక్షణ, మౌలిక వసతులు, రక్షణ, శక్తి, వ్యవసాయం, బీమా రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని అమెరికా సంస్థలను ఆహ్వానించారు ప్రధాని నరేంద్ర మోదీ. యూఎస్​-ఇండియా బిజినెస్ కౌన్సిల్​ నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు ప్రసంగించారు. ప్రపంచ దేశాలన్నీ వ్యాపార అవకాశాల కోసం భారత్ వైపు చూస్తున్నాయన్నారు.

యూఎస్​-ఇండియా బిజినెస్ కౌన్సిల్ నిర్వహించిన సమావేశంలో వీడియో కాన్పరెన్స్​ ద్వారా ప్రసంగించారు ప్రధాని నరేంద్ర మోదీ. వ్యాపారానికి అనువైన ప్రాంతంగా ప్రపంచ దేశాలన్నీ భారత్​ వైపు చూస్తున్నాయని.. ఇక్కడ అవకాశాలతో పాటు స్వేచ్ఛ, సాంకేతికతపరంగా అవసరమైన అన్ని సదుపాయాలు ఉన్నట్లు స్పష్టం చేశారు మోదీ.

భారత్​లో ఆరోగ్య సంరక్షణ, మౌలిక వసతులు, రక్షణ, శక్తి, వ్యవసాయం, బీమా రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని అమెరికా కంపెనీలను ఆహ్వానించారు మోదీ. భారత్​లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు గణనీయంగా పెరిగినట్లు గుర్తుచేశారు. పెట్టుబడలకు నిలయంగా భారత్ అవతరిస్తోందన్నారు.

కరోనా వైరస్ మహమ్మారి ఆర్థిక స్థితిస్థాపకత ప్రాముఖ్యతను తెలియజేసిందని, బలమైన దేశీయ ఆర్థిక సామర్థ్యాల ద్వారా దీనిని సాధించవచ్చని మోదీ అన్నారు. భారత్​లో.. పట్టణవాసుల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ఇంటర్నెట్​ వినియోగదారుల సంఖ్య పెరిగినట్లు ఇటీవల ఓ నివేదిక వెల్లడించినట్లు చెప్పారు మోదీ. ఆర్థిక సంస్కరణలు పోటీతత్వం, పారదర్శకత, డిజిటలైజేషన్, ఆవిష్కరణలు, విధాన స్థిరత్వాన్ని నిర్ధరించాయన్నారు.

ఇదీ చూడండి: 'ఆ శక్తి భారత్​- అమెరికాకు మాత్రమే ఉంది'

Last Updated :Jul 23, 2020, 1:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.