ETV Bharat / international

'ఆ శక్తి భారత్​- అమెరికాకు మాత్రమే ఉంది'

author img

By

Published : Jul 22, 2020, 9:01 PM IST

భారత్-అమెరికా తమ వాణిజ్య సమస్యల పరిష్కారానికి పరస్పరం సహకరించుకొని.. మరింత ముందుకెళ్లాలని దేశ విదేశాంగమంత్రి జైశంకర్​ పేర్కొన్నారు. వాణిజ్యానికి మించి భారత్​-అమెరికాల మధ్య విడదీయని అనుబంధం ఉందన్నారు జైశంకర్​.

India, US have ability to shape larger global agenda: Jaishankar on bilateral ties
భారత్-అమెరికా వాణిజ్య సమస్యలను పరిష్కరించుకోవాలి: జైశంకర్

వాణిజ్యానికి సంబంధించి ప్రపంచస్థాయి భారీ ఎజెండాను రూపొందించే సత్తా భారత్​- అమెరికాకు ఉందని స్పష్టం చేశారు విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్. భారత్​-అమెరికా మధ్య నెలకొన్న వాణిజ్య సమస్యలను పరిష్కారానికి ఇరుదేశాలు పరస్పరం సహకరించుకొవాలన్నారు. భారత్​- అమెరికా మధ్య మరింత భారీ స్థాయిలో వాణిజ్యం జరగాల్సిన అవసరం ఉందన్నారు.

'ఇండియా ఐడియాస్ సమ్మిట్'లో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా పాల్గొన్న జైశంకర్ ఇరుదేశాల వాణిజ్య సంబంధాలపై మాట్లాడారు.

"భారత్​-అమెరికా మధ్య ఆర్థిక సంబంధాల సంక్లిష్టతను నేను అర్థం చేసుకున్నాను. ఇది వెన్న, రొట్టెల సమస్య లాంటింది. అందువల్ల భారత్​-అమెరికాలు తమ వాణిజ్య సమస్యల పరిష్కారానికి పరస్పరం సహకరించుకోవాలి. ఇరుదేశాల మధ్య వాణిజ్యం మరింత భారీ స్థాయిలో జరిగేలా చూడాలి."

- జైశంకర్, భారత విదేశాంగమంత్రి

నాలెడ్జ్ ఇన్నోవేషన్​

వాణిజ్యానికి మించి భారత్​-అమెరికాల మధ్య విడదీయరాని అనుబంధం ఉందని, అదే నాలెడ్జ్ ఇన్నోవేషన్​ అని జైశంకర్ పేర్కొన్నారు. రాజకీయపరంగా

అమెరికా నేడు బహుళ ధృవ ప్రపంచంతో ఎలా పనిచేయాలో నేర్చుకోవాలని సూచించారు జైశంకర్.

ఇదీ చూడండి: 'కరోనాపై తొలి నుంచీ భారత్​ స్పందన భేష్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.