ETV Bharat / bharat

బలవంతంగా యూపీ 'నిర్భయ' అంత్యక్రియలు!

author img

By

Published : Sep 30, 2020, 11:03 AM IST

Updated : Sep 30, 2020, 12:41 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ హత్రాస్​ అత్యాచార ఘటన బాధితురాలి అంత్యక్రియలను పోలీసులు బలవంతగా నిర్వహించారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. మరణించిన రోజే హుటాహుటిన భౌతిక కాయాన్ని దిల్లీ నుంచి యూపీ తరలించి, బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో కార్యక్రమం నిర్వహించారని పేర్కొన్నారు. మరోవైపు అత్యాచార ఘటనపై విచారణకు ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు.

Hathras gang-rape victim cremated in dead of night; kin allege police did it forcibly
బలవంతంగా హత్రాస్ అత్యాచార బాధితురాలి అంత్యక్రియలు!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తర్​ప్రదేశ్ హత్రాస్ అత్యాచార ఘటన బాధితురాలి అంత్యక్రియలు బుధవారం వేకువ జామున జరిగాయి. అయితే తమ అనుమతి లేకుండా యూపీ పోలీసులు హుటాహుటిన కార్యక్రమం నిర్వహించారని బాధితురాలి సోదరుడు ఆరోపించారు. దిల్లీ సఫ్దార్​జంగ్ ఆస్పత్రిలో బాధితురాలు మరణించిన రోజే భౌతిక కాయాన్ని హత్రాస్ తరలించినట్లు పేర్కొన్నారు. అంత్యక్రియలను బంధువుల సమక్షంలో బుధవారం రోజు నిర్వహిస్తామని చెప్పినా పోలీసులు ఒప్పుకోలేదన్నారు.

అయితే పోలీసులు మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల అనుమతితోనే కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. హత్రాస్​ జిల్లా కలెక్టర్ సైతం అదే విషయాన్ని స్పష్టంచేశారు.

సిట్ ఏర్పాటు

సెప్టెంబరు 14న జరిగిన ఎస్సీ యువతి అత్యాచర ఘటనపై విచారణ జరిపేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. వారం రోజుల్లోగా నివేదిక అందజేస్తారని పేర్కొన్నారు. ఫాస్ట్ ట్రాక్​ కోర్టులో విచారణ జరిపి, న్యాయప్రక్రియ త్వరగా జరిగేలా చూస్తామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

యోగికి మోదీ ఫోన్​..

ప్రధాని నరేంద్ర మోదీ తనకు ఫోన్​ చేసి హత్రాస్ అత్యాచార ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారని యోగి తెలిపారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని మోదీ చెప్పారని ట్వీట్ చేశారు.

యోగి రాజీనామాకు డిమాండ్..

అంత్యక్రియలు బలవంతంగా నిర్వహించారనే వార్తలపై కాంగ్రెస్ స్పందించింది. బాధితురాలికి అంతిమ సంస్కారాలు నిర్వహించే చివరి అవకాశం కూడా ఆమె కుటుంబ సభ్యులకు దక్కకుండా చేశారని ప్రభుత్వంపై రాహుల్ గాంధీ మండిపడ్డారు.

  • भारत की एक बेटी का रेप-क़त्ल किया जाता है, तथ्य दबाए जाते हैं और अन्त में उसके परिवार से अंतिम संस्कार का हक़ भी छीन लिया जाता है।

    ये अपमानजनक और अन्यायपूर्ण है।#HathrasHorrorShocksIndia pic.twitter.com/SusyKV6CfE

    — Rahul Gandhi (@RahulGandhi) September 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

" ఓ కూతురిపై అత్యాచారం చేసి హతమార్చారు. వాస్తవాలను కప్పిపెట్టారు. చివరకు అంత్యక్రియలు నిర్వహించకుండా బాధితురాలి కుటుంబ సభ్యుల హక్కులను కూడా హరించారు. ఇది అవమానం, అన్యాయం"

-రాహుల్ ట్వీట్​.

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కూడా యోగి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. బాధితురాలి కుటుంబానికి రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వమే వారి హక్కులను కాల రాస్తోందని విమర్శించారు. ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

నిరసనలు..

hathras protests
హత్రాస్​లో నిరసనలు
hathras protests
హత్రాస్​లో నిరసనలు

అత్యాచార ఘటనలో బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని ఎస్సీ సంఘాలు హత్రాస్​లో నిరసనలు చేపట్టాయి. పోలీసులు, స్థానిక అధికారులకు వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు.

hathras protests
హత్రాస్​లో నిరసనలు
hathras protests
హత్రాస్​లో నిరసనలు
hathras protests
హత్రాస్​లో నిరసనలు

ఇదీ చూడండి: యూపీ 'నిర్భయ' మృతి- పెల్లుబుకిన జనాగ్రహం

Last Updated : Sep 30, 2020, 12:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.