ETV Bharat / bharat

లేహ్ మాదే.. ట్విట్టర్ సీఈఓకు కేంద్రం ఘాటు లేఖ

author img

By

Published : Oct 22, 2020, 1:31 PM IST

Updated : Oct 22, 2020, 5:09 PM IST

కశ్మీర్​లోని లేహ్ జియో లొకేషన్​ను​ చైనా భూభాగంగా చూపటంపై ట్విట్టర్​కు కేంద్రం లేఖ రాసింది. దేశ సార్వభౌమత్వం, సమగ్రతను అగౌరపరిచే ఏ కార్యక్రమం కూడా ఆమోదయోగ్యం కాదని, చట్టవిరుద్ధమని హెచ్చరించింది. భారత చిత్ర పటాన్ని తప్పుగా చూపించటంపై మండిపడింది.

Govt issues warning to Twitter
ట్విట్టర్​కు కేంద్రం ఘాటు లేఖ

జమ్ముకశ్మీర్​లోని లేహ్​ ప్రాంతాన్ని చైనా భూభాగంలో ఉన్నట్లు చూపటాన్ని తప్పుపడుతూ.. ట్విట్టర్​ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి(సీఈఓ) జాక్​ డోర్సేకు ఘాటు లేఖ రాసింది కేంద్ర ప్రభుత్వం. భారత చిత్ర పట్టాన్ని తప్పుగా చూపించటంపై తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. భారతీయుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించొద్దని హెచ్చరించింది.

దేశ సార్వభౌమత్వం, సమగ్రతను అగౌరవపరిచే ఏ కార్యక్రమం కూడా ఆమోదయోగ్యం కాదని లేఖలో పేర్కొన్నారు ఐటీ శాఖ కార్యదర్శి అజయ్​ సాహ్నే.

" ఇలాంటి చర్యలు ట్విట్టర్​కు అపఖ్యాతిని కలిగించటమే కాకుండా.. సంస్థపై పలు అనుమానాలను రేకెత్తిస్తాయి. లద్దాఖ్​కు లేహ్​ హెడ్​క్వార్టర్​. లద్దాఖ్​, జమ్ముకశ్మీర్​ భారత అంతర్గత ప్రాంతాలు. భారత రాజ్యాంగం ద్వారా అక్కడ పాలన సాగుతోంది. భారతీయుల మనోభావాలను గౌరవించాల్సిందే. దేశ సౌర్వభౌమత్వాన్ని అగౌరవపరిచే చర్యలు ఆమోదయోగ్యం కాదు, చట్ట విరుద్ధ కూడా."

- అజయ్​ సాహ్నే, ఐటీ శాఖ కార్యదర్శి.

జమ్ముకశ్మీర్​లోని లేహ్​ ప్రాంతాన్ని ట్విట్టర్​ చైనా భూభాగంగా చూపించటంపై వివాదం చెలరేగింది. ట్విట్టర్​పై తీవ్రంగా మండిపడ్డారు నెటిజన్లు. అయితే.. వెంటనే స్పందించిన ట్విట్టర్​.. సాంకేతిక సమస్యను పరిష్కరించినట్లు వివరణ ఇచ్చింది. జమ్ముకశ్మీర్ అంశంలో నెలకొన్న సున్నితత్వాన్ని అర్థం చేసుకుని గౌరవిస్తామని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: కశ్మీర్​ను చైనాలో భాగంగా చూపిన ట్విట్టర్!

Last Updated :Oct 22, 2020, 5:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.