ETV Bharat / bharat

లాక్​డౌన్​లో 2.14 కోట్లమంది వలస కూలీలకే ఉచిత రేషన్​

author img

By

Published : Jul 2, 2020, 5:02 AM IST

Updated : Jul 2, 2020, 6:20 AM IST

లాక్​డౌన్​ సమయంలో రేషన్​ కార్డు లేని వలస కూలీలకు కేంద్రం ఉచితంగా ఇచ్చిన రేషన్​ సరకులు 2.14కోట్ల మందికే అందాయి. ఈ మేరకు కేంద్ర పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే గోవా, తెలంగాణ రాష్ట్రాలు ఒక్కరికి కూడా ఈ రేషన్​ ఇవ్వలేదని వెల్లడించింది.

Free grains reach to only 2.14 cr migrants across India; no beneficiaries in Goa, Telangana
లాక్​డౌన్​లో 2.14 కోట్లమంది వలస కూలీలకే ఉచిత రేషన్​

లాక్​డౌన్​ కారణంగా వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారికి సాయంగా రేషన్ కార్డులు లేని వారికి ఉచిత రేషన్​ సరకులు అందించింది కేంద్రం. అయితే ఇవి కేవలం 2.14కోట్ల మందికే అందినట్లు కేంద్ర పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ తెలిపింది. మే, జూన్​ నెలల్లో దేశవ్యాప్తంగా సుమారు 8కోట్ల మంది వలస కూలీలకు ఒక్కొక్కరికి 5కిలోల ఆహార ధాన్యంతో పాటు కుటుంబానికి కిలో పప్పు అందించినట్లు కేంద్రం ప్రకటించింది.

అయితే పలు రాష్ట్రాలు ఈ మేరకు సరకులు పంపిణీ చేయలేకపోయాయని కేంద్ర ఆహార కార్యదర్శి సుధాన్షు పాండే తెలిపారు. గోవా, తెలంగాణ రాష్ట్రాలు ఒక్కరికి కూడా ఈ రేషన్​ ఇవ్వలేదన్నారు. బిహార్, గుజరాత్​, మహారాష్ట్ర, తమిళనాడు, సిక్కిం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్​లలో జూన్​ నెలలో ఆహార ధాన్యాలు పంపిణీ చేయలేదని అన్నారు. వలస కార్మికులు అప్పటికే సొంత రాష్ట్రాలకు వెళ్లిపోవడం వల్ల సరకులు పంపిణీ చేయలేకపోయినట్టు ఈ రాష్ట్రాలు కేంద్రానికి తెలిపాయన్నారు.

మే నెలలో 1.21కోట్ల మంది వలస కూలీలకు 60,810టన్నుల ఆహార ధాన్యాలు పంపిణీ చేయగా.. జూన్​లో 92.44 లక్షల మంది లబ్ధి పొందినట్లు వెల్లడించారు పాండే. మే నెలలో అత్యధికంగా రాజస్థాన్​లో 42.27లక్షల మంది లబ్ధిపొందగా.. మహారాష్ట్ర (15.36లక్షలు), కర్ణాటక(12.31) తర్వాత రెండు స్థానాల్లో ఉన్నాయి. జూన్​లోనూ రాజస్థాన్​ ప్రథమ స్థానంలో ఉండగా.. బంగాల్​, హరియాణాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ​

ఇదీ చూడండి: అసోంలో ఆగని వరద ఉద్ధృతి.. మరో ఏడుగురు మృతి

Last Updated : Jul 2, 2020, 6:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.