ETV Bharat / bharat

దిల్లీ ఎయిమ్స్​ నుంచి మన్మోహన్​ సింగ్​ డిశ్చార్జ్

author img

By

Published : May 12, 2020, 1:02 PM IST

Updated : May 12, 2020, 1:20 PM IST

Former Prime Minister Dr Manmohan Singh has been discharged from AIIMS, Delhi on medical advice
దిల్లీ ఎయిమ్స్​ నుంచి మన్మోహన్​ సింగ్​ డిశ్చార్జ్

13:00 May 12

దిల్లీ ఎయిమ్స్​ నుంచి మన్మోహన్​ సింగ్​ డిశ్చార్జ్

అనారోగ్యంతో ఆదివారం రాత్రి దిల్లీ ఎయిమ్స్​లో చేరిన మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ నేడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నందున వైద్యులు ఆయన్ను ఇంటికి పంపారు.

కరోనా నెగిటివ్...

జ్వరంతో బాధపడుతున్న మన్మోహన్​కు ఎయిమ్స్​ వైద్యులు చికిత్స అందించారు. సింగ్ పరిస్థితి బాగానే ఉందని సోమవారం ఉదయం ప్రకటించారు. ముందు జాగ్రత్తగా కరోనా పరీక్షలు నిర్వహించారు. మాజీ ప్రధానికి వైరస్ సోకలేదని నిర్ధరించారు. సోమవారం సాయంత్రానికి మన్మోహన్​కు జ్వరం తగ్గగా... వైద్యులు నేడు ఆయన్ను డిశ్చార్జ్ చేశారు.

Last Updated :May 12, 2020, 1:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.