ETV Bharat / bharat

ఎయిడ్స్ మందులతో కోలుకున్న కరోనా బాధితుడు

author img

By

Published : Mar 26, 2020, 8:39 AM IST

కరోనా బారిన పడిన ఓ బ్రిటిష్ పౌరుడు కేరళలో చికిత్స అనంతరం కోలుకున్నాడు. ఇతనికి హెచ్​ఐవీ ఎయిడ్స్​ మందులను వినియోగించినట్లు ఎర్నాకులం వైద్య కళాశాల ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

KL-VIRUS-HIV
కరోనా

దేశంలో కరోనా బాధితులు పెరుగుతున్న నేపథ్యంలో చికిత్స అందించే విషయంలో వైద్యులు అనేక మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎర్నాకులంలోని వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్న బ్రిటిష్ జాతీయుడికి హెచ్​ఐవీ-ఎయిడ్స్ మందులను వినియోగించారు. అతడు కోలుకున్నట్లు అక్కడి వైద్యులు తెలిపారు.

ఏడు రోజుల్లోనే..

బ్రిటన్​ నుంచి వచ్చిన పౌరుడికి కరోనా పాజిటివ్​గా తేలింది. అతనికి రిటొనావిర్, లొపినావిర్​ కాంబినేషన్​ మందులతో చికిత్స అందించారు. ఏడు రోజుల తర్వాత జరిపిన పరీక్షల్లో అతనికి కరోనా నెగటివ్​ వచ్చింది.

కరోనా బారినపడినవారికి ఈ కాంబినేషన్​ మందులు ఇచ్చేందుకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్​) అనుమతి ఇచ్చింది. ఇప్పటికే జైపుర్​లోని ఆసుపత్రిలో కరోనా సోకిన విదేశీ వైద్యుడికి ఇవే మందులతో చికిత్స చేశారు. ఆయన కూడా కోలుకున్నాడు.

ఇదీ చూడండి: సుఖీభవ: ఆయుర్వేదంతో కరోనాను అరికట్టవచ్చా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.