ETV Bharat / bharat

మధ్యప్రదేశ్​లో​ ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

author img

By

Published : Jun 22, 2020, 4:22 PM IST

Updated : Jun 22, 2020, 4:37 PM IST

Five people killed in an road mishap
మధ్యప్రదేశ్​లో​ ఘోర రోడ్డు ప్రమాదం

మధ్యప్రదేశ్​ రాజ్​గఢ్​ జిల్లా సారంగ్​పుర్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి.

మధ్యప్రదేశ్ రాజ్​గఢ్​​ జిల్లా సారంగ్​పుర్​లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీ కొన్న ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

మధ్యప్రదేశ్​లో​ ఘోర రోడ్డు ప్రమాదం

ఒక కారులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందగా.. మరో చిన్నారికి గాయాలయ్యాయి. వీరు ఇండోర్​ నుంచి గునాకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మరో కారులో మహారాష్ట్ర నుంచి ఉత్తర్​ప్రదేశ్​లోని లఖ్​నవూకి ఐదుగురు సాధువులు వెళ్తున్నారు. వీరిలో ఒకరు మృతి చెందగా మరో నలుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

ఇదీ చూడండి:తమిళనాడులో మాజీ సీఎంల విగ్రహాలకు మాస్క్​లు!

Last Updated :Jun 22, 2020, 4:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.