ETV Bharat / bharat

నకిలీ కరోనా ఔషధాల కేంద్రం గుట్టురట్టు.. కానీ

author img

By

Published : Sep 27, 2020, 6:21 AM IST

ఒడిశాలో నకిలీ కరోనా మందులను తయారు చేస్తోన్న ఓ కేంద్రం గుట్టురట్టు చేశారు అధికారులు. బార్​గఢ్​ జిల్లాలోని రుసుడా గ్రామంలో ఉన్న ఈ కేంద్రం నుంచి.. ఔషధానికి సంబంధించిన 12 సీసాలు, స్టిక్కర్లను గుర్తించారు. అయితే ఈ ఘటనకు సంబంధం ఉన్న వ్యక్తి మాత్రం.. వేరే కథ చెబుతున్నాడు. ఇది నకిలీ ఔషధం కాదని.. కరోనా చికిత్సలో 100 శాతం పనిచేస్తుందని చెబుతున్నాడు. ప్రభుత్వం దీనిపై ట్రయల్స్​ నిర్వహించాలని కోరుతున్నాడు.

fake COVID-19 drug unit busted
నకిలీ కరోనా ఔషధాల కేంద్రం గుట్టురట్టు.. కానీ

ఒడిశాలోని బార్​గఢ్​ జిల్లాలో నకిలీ కరోనా మందులను తయారు చేస్తున్న ఓ కేంద్రంపై అధికారులు సోదాలు నిర్వహించారు. రుసుడా గ్రామంలో.. బార్​గఢ్​- సంబల్​పుర్​ డ్రగ్​ ఇన్​స్పెక్టర్లు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించగా.. ఔషధానికి సంబంధించి 12 సీసాలు, స్టిక్కర్లను గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ప్రహ్లాద్​ బిషి అనే వ్యక్తికి నోటీసులు జారీ చేశారు.

అయితే.. ఇవి నకిలీ మందులు కావని.. కరోనాపై ఇవి సమర్థంగా పనిచేస్తున్నాయని బిషి పేర్కొన్నారు.

"కరోనాకు చికిత్స కోసం ఈ మందులను నేను స్వయంగా తీసుకున్నా. నేను రూపొందించిన మందు కరోనాపై 100 శాతం పనిచేస్తుంది. డ్రగ్​ ఇన్​స్పెక్టర్​, ప్రభుత్వానికి ఈ విషయాన్ని నేనే స్వయంగా తెలియజేశాను. ట్రయల్స్​ నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరాను."

--- ప్రహ్లాద్​ బిషి, బార్​గఢ్​వాసి

ఇదీ చూడండి:- 'కలిసికట్టుగా లేకుంటే 20 లక్షల కొవిడ్​ మరణాలు!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.