ETV Bharat / bharat

'ఆయుర్వేదమే కరోనాను తరిమే ఔషధం!'

author img

By

Published : Jul 14, 2020, 1:15 PM IST

ఎలాంటి వ్యాధినైనా అంతం చేసే ఆయుర్వేదాన్ని వేల ఏళ్ల క్రితమే మన పూర్వీకులు కనిపెట్టారు. చిన్న చిన్న ఆయుర్వేద చిట్కాలు పాటించి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించారు. ఆ సంప్రదాయ పద్ధతులను మనమూ పాటిస్తే ఇప్పుడు కరోనా వైరస్​నూ సులభంగా ఎదుర్కోవచ్చు అంటున్నారు వైద్య నిపుణులు.

'Develop, maintain immunity by Ayurveda to deal with Covid-19'
'ఆయుర్వేదమే కరోనాను తరిమే ఔషధం!'

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. ఆ మహమ్మారిని అంతం చేసే మందును శాస్త్రవేత్తలు ఇంకా కనిపెట్టలేకపోతున్నారు. అయితే, కరోనా శరీరంలోకి ప్రవేశిస్తే దానిని జయించే శక్తి భారతీయులు సులభంగా పొందొచ్చు అంటున్నారు ఉత్తరాఖండ్ హల్ద్వాన్​కు చెందిన ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్​ మీరా జోషి. ఎలాంటి వైరస్​ను అయినా అంతం చేసే రోగనిరోధక శక్తిని భారతీయ సంప్రదాయం, ఆయుర్వేదంతో సంపాదించుకోవచ్చు అంటున్నారు.

ఇంగ్లీషు మందుల కంటే.. ఆయుర్వేదంతోనే కరోనాను సులభంగా జయించొచ్చని చెబుతున్నారు డాక్టర్​ మీరా జోషి.

'ఆయుర్వేదమే కరోనాను తరిమే ఔషధం!'

"ఆయుర్వేద ఔషధాలతో.. రోగనిరోధక శక్తిని పెంచుకుంటే, వైరస్​తో పోరాడే శక్తి లభిస్తుంది. పసుపు వేసిన పాలు, తులసి ఆకులు, అశ్వగంధ ఇలా ఎన్నో మూలికలతో కషాయం చేసుకుని తాగొచ్చు. ఇవే కాకుండా, ధ్యానం , యోగా, ప్రాణాయామం వంటి భారతీయ వ్యాయామాలను సాధన చేస్తే ఎలాంటి వ్యాధులైనా నయమైపోతాయి. వీటితో పాటు, కరోనా జాగ్రత్తలు పాటించాలి. అలోపతి ఔషధాల కంటే, ఆయుర్వేదంతోనే వేగంగా కోలుకోవచ్చు"

- మీరా జోషి, ఆయుర్వేద నిపుణురాలు

ఇదీ చదవండి: 'థాయ్​ మసాజ్'​ పుట్టింది భారత్​లోనే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.