ETV Bharat / bharat

మహారాష్ట్రలో మరో 22వేల మందికి కరోనా

author img

By

Published : Sep 12, 2020, 7:28 PM IST

Updated : Sep 12, 2020, 8:54 PM IST

దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఉత్తర్​ప్రదేశ్​ రాష్ట్రాల్లోనే అధిక కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో 22,084 కేసులు వెలుగుచూశాయి. ఉత్తర్​ప్రదేశ్​లో 6,846 మంది వైరస్​ బారిన పడ్డారు.

COVID-19 tally in UP crosses 3-lakh mark; death toll reaches 4,349
ఉత్తర్​ప్రదేశ్​లో 3 లక్షలు దాటిన కేసులు

దేశంపై కరోనా పంజా విసురుతోంది. రోజురోజుకు వైరస్ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. తాజాగా 22,084 మందికి పాజిటివ్​గా తేలింది. మరో 391 మంది మరణించగా.. 13,489 మంది కోలుకున్నారు.. రాష్ట్రంలో మొత్తం 10,37,765 మంది బాధితులు ఉన్నారు. వీరిలో 7,28,512 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 29,115 మంది ప్రాణాలు కోల్పోయారు.

  • ఉత్తర్​ప్రదేశ్​లో తాజాగా 6,846 కేసులు బయటపడ్డాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 3లక్షలు దాటింది. రాష్ట్రంలో 67,955 యాక్టివ్​ కేసులు ఉండగా.. 2,33,527 మంది కోలుకున్నారు.
  • తమిళనాట మరో 5,495 మందికి పాజిటివ్​గా తేలింది. ఒక్కరోజులో 76 మంది మృతి చెందగా.. 6,227 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో 4,97,066 మంది బాధితులు ఉండగా.. 8,307 మంది వైరస్​ కారణంగా ప్రాణాలు విడిచారు.
  • దిల్లీలో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా రికార్డు స్థాయిలో 4,321 కేసులను గుర్తించారు. దీంతో మొత్తం 2.14 లక్షల మంది వైరస్ బారిన పడ్డారు. 4,715 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఒడిశాలో తాజాగా 3,777 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. మరో 11 మంది మృతి చెందగా.. మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 616కు ఎగబాకింది. మొత్తం 1,46,894 మంది బాధితులు ఉన్నారు.
  • కేరళలో కొత్తగా 2,885 కేసులు వెలుగు చూశాయి. రాష్ట్రంలో 28,802 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. మరో 75,848 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.
  • జమ్ముకశ్మీర్​లో మరో 1,698 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. వీరిలో 838 మంది జమ్ములో, 860 మంది కశ్మీర్​లో బయటపడ్డారు.
  • బిహార్​లో కొత్తగా 1,421 కేసులు వెలుగు చూశాయి. మరో 1700 మంది రికవరీ అయ్యారు. మొత్తం కేసుల సంఖ్య 1,56,866 ఉండగా.. అందులో 14,899 మంది చికిత్స పొందుతున్నారు.
  • రాజస్థాన్​లో మరో 739 మంది వైరస్ బారిన పడగా.. ఏడుగురు మరణించారు.
  • త్రిపురలో మరో 559 మంది కరోనా బారినపడగా... మొత్తం 17,833 మంది వైరస్​ బాధితులు ఉన్నట్లు గుర్తించారు. ఫలితంగా 172 మంది వైరస్​కు బలయ్యారు.
  • పుదుచ్చేరిలో తాజాగా నమోదైన కేసులతో కలిపి... మొత్తం 19,439 మంది బాధితులు ఉన్నారు. వీరిలో 14,238 మంది డిశ్చార్జ్​ అయ్యారు.
  • అసోం భాజపా ఎమ్మెల్యే అశోక్​ శర్మకి కరోనా పాజిటివ్‌గా తేలింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 26 శాసనసభ్యులకు వైరస్ సోకింది. ఎమ్మెల్యేతో పాటు ఆయన సతీమణీ కూడా వైరస్ బారిన పడ్డారు.
Last Updated : Sep 12, 2020, 8:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.