ETV Bharat / bharat

దేశంలో 91 లక్షలు దాటిన కరోనా కేసులు

author img

By

Published : Nov 23, 2020, 9:41 AM IST

భారత్​లో కొత్తగా 44,059 మందికి వైరస్​ సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 91 లక్షలు దాటింది. మరో 511 మంది మహమ్మారితో మరణించారు.

corona new cases in india on monday is 44,059 and deaths are 511
దేశంలో కొత్తగా 44,059 మందికి వైరస్​

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్థిరంగా పెరుగుతోంది. తాజాగా 44,059 మంది వైరస్​ బారిన పడ్డారు. మెత్తం కొవిడ్​ బాధితుల సంఖ్య 91,39,866కు చేరింది.

మరో 511 మంది మహమ్మారికి బలయ్యారు. మొత్తం మరణాల సంఖ్య 1,33,738కి పెరిగింది.

దేశంలో కొత్తగా 41,024 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

ఆదివారం మొత్తం 8,49,596 పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు చేపట్టిన మొత్తం పరీక్షల సంఖ్య 13,25,82,730కి చేరింది.

ఇదీ చూడండి:కొవాగ్జిన్‌ సమర్థత 60 శాతం పైనే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.