సాయుధ దళాల పతాక నిధికి తోడ్పడాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఫ్లాగ్ డే సందర్భంగా ఆర్మీ, వాయుసేన, నౌకాదళాల పోరాట పటిమను ప్రధాని మోదీ కీర్తించారు. వారికి, వారి కుటుంబ సభ్యులకు సెల్యూట్ చేస్తున్నట్లు మోదీ ట్విటర్ ద్వారా తెలిపారు.సైనిక సహాయ నిధికి ప్రజలు విరాళాలు ఇవ్వాలని మోదీ విజ్ఞప్తి చేశారు.
"సాయుధ దళాల పతాక దినోత్సవం (ఫ్లాగ్ డే) సందర్భంగా మన దళాలు, వారి కుటుంబాల ధైర్యానికి నమస్కరిస్తున్నాను. మన దళాల సంక్షేమానికి తోడ్పడాలని మిమ్మల్ని కోరుతున్నాను " -ప్రధాని
1949 నుంచి ఏటా డిసెంబర్ 7వ తేదీని సాయుధ దళాల పతాక దినోత్సవంగా జరుపుకుంటున్నారు భారతీయులు. వివిధ పోరాటాల్లో గాయపడిన సైనికులు, మరణించిన సైనికుల కుటుంబాల సంక్షేమం కోసం సాయుధ బలగాల పతాక నిధిని వినియోగిస్తారు.
- ఇదీ చదవండి:అమ్మాయిల్ని అల్లరి చేసిన ఆకతాయికి దేహశుద్ధి!