ETV Bharat / bharat

గూడ్స్​ను ఢీకొన్న ఎక్స్​ప్రెస్​ రైలు.. 15మందికి గాయాలు

author img

By

Published : Jan 16, 2020, 8:52 AM IST

Updated : Jan 16, 2020, 11:16 AM IST

6 bhogis drail in odisha
పట్టాలు తప్పిన రైలు... 50మందికి పైగా గాయాలు

ఒడిశాలోని నిర్గుండి వద్ద లోక్​మాన్య తిలక్ ఎక్స్​ప్రెస్​.. గుడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 బోగీలు పట్టాలు తప్పగా, 15 మంది గాయపడ్డారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.

ఒడిశాలో కటక్‌ సమీపంలోని నిర్గుండి వద్ద రైలు ప్రమాదం జరిగింది. ముంబయి నుంచి భువనేశ్వర్‌ వెళ్తున్న లోక్‌మాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌ నిర్గుండి వద్ద గూడ్స్​ రైలును ఢీకొట్టింది. ఘటనలో మొత్తం 8 బోగీలు పట్టాలు తప్పగా, 15 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వారిని కటక్‌లోని ఎస్​ఎస్​బీ వైద్య కళాశాలకు తరలించారు.

ప్రమాదం కారణంగా ఆ మార్గంలో వెళ్లే ఆరు రైళ్లను దారి మళ్లించారు. ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు తరలించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున పొగమంచు వ్యాపించి ఉందన్నారు. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

గూడ్స్​ను ఢీకొన్న ఎక్స్​ప్రెస్​ రైలు
Intro:Body:

sdds


Conclusion:
Last Updated :Jan 16, 2020, 11:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.