జమ్ముకశ్మీర్లోని పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించేందుకు హోంశాఖ చర్యలు ప్రారంభించింది. తాజాగా జమ్ము, సాంబా, కతువా, ఉదంపుర్, రియాసి జిల్లాల్లో అధికారిక వెబ్సైట్లను అనుమతిస్తూ 2జీ పోస్ట్పెయిడ్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఆస్పత్రులు, హోటళ్లు, రవాణ సంస్థల్లో బ్రాడ్బ్యాండ్ సేవలను కల్పించింది.
జమ్ముకశ్మీర్లో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో అక్కడి యంత్రాంగం చర్యలకు ఉపక్రమించింది. ఇంటర్నెట్ సేవలను పొందడం పాథమిక హక్కు అని విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.