ETV Bharat / bharat

ప్రేమజంటపై గ్రామస్థుల దాడి- జననాంగాలపై కాల్చి..

author img

By

Published : Sep 8, 2020, 11:43 AM IST

Bihar
ప్రేమజంటపై గ్రామస్థుల దాడి

బిహార్​ కటిహార్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఖాప్​ పంచాయితీ తీర్పు పేరుతో ఓ ప్రేమ జంటపై అమానుషంగా ప్రవర్తించారు గ్రామస్థులు. వారి జననాంగాలపై ఇనుప రాడ్​తో కాల్చి.. వీధుల్లో ఊరేగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

బిహార్​ కటిహార్ జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఉత్తర భారతంలో ఖాప్​ పంచాయితీల పైశాచికం మరోసారి బయటపడింది. జిల్లాలోని డండ్​ఖోరాలో సామాజిక వర్గాలు వేరని ఓ ప్రేమ జంటను తీవ్రంగా హింసించారు. ఖాప్​ పంచాయితీ తీర్మానం ప్రకారం.. వారి మర్మాంగాలపై కాల్చిన ఇనుప రాడ్లతో అచ్చు వేసి.. వీధుల్లో ఊరేగించినట్లు పోలీసులు తెలిపారు.

ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ కావటం వల్ల ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు యువతీయువకులు పక్కపక్క గ్రామాల వారని తెలుస్తోంది.

అసలేం జరిగింది..

శుక్రవారం రాత్రి యువతిని కలిసేందుకు ఆమె గ్రామానికి యువకుడు వెళ్లాడు. వారిద్దరూ కలిసి ఉండగా యువతి గ్రామానికి చెందిన కొంతమంది వీడియో చిత్రీకరించారు. అనంతరం ఇద్దరినీ బెదిరించి.. యువతితో అసభ్యంగా ప్రవర్తించారు. వారిద్దరూ నగ్నంగా ఉండగా కొంతమంది గ్రామస్థులు కూడా వీడియోలు తీసినట్లు తెలుస్తోంది.

అదే రోజు రాత్రి ఖాప్​ పంచాయితీ ముందుకు బాధితులు ఇద్దర్నీ తీసుకెళ్లారు గ్రామస్థులు. వారిని జననాంగాలపై ఇనుప రాడ్​తో కాల్చి.. ఊరేగించాలని తీర్పును ఇచ్చింది ఖాప్​ పంచాయితీ. అంతేకాకుండా రూ.2.25 లక్షల జరిమానా విధించింది.

పోలీసుల వేట..

ఈ సమాచారం అందగానే డండ్​ఖోరా పోలీసులు.. బాధితులు ఇద్దరినీ రక్షించారు. యువతి ఇచ్చిన సమాచారం ప్రకారం ఎఫ్​ఐఆర్​ నమోదు చేసిన పోలీసులు.. చాలామంది గ్రామస్థులపై కేసులు పెట్టారు. నిందితుల కోసం గాలింపు చేపట్టామని కటిహార్​ ఎస్​పీ హరిమోహన్​ శుక్లా తెలిపారు.

ఇదీ చూడండి: స్కూలు పిల్లలకు ఐస్‌క్రీముల్లో డ్రగ్స్ కలిపి వల!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.