ETV Bharat / bharat

2022 ఉత్తర్​ప్రదేశ్ ఎన్నికల బరిలో ఆమ్​ఆద్మీ

author img

By

Published : Dec 15, 2020, 1:41 PM IST

AAP to contest 2022 UP Assembly elections: Arvind Kejriwal
'2022 ఉత్తర్​ ప్రదేశ్ ఎన్నికల్లో ఆమ్​ఆద్మీ బరిలోకి '

రాబోయే ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్​ఆద్మీ పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత అరవింద్​ కేజ్రీవాల్ ప్రకటించారు. యూపీ ప్రజలు ప్రస్తుత ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారని కేజ్రీ అన్నారు.

2022 ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయనున్నట్లు ఆమ్​ఆద్మీ పార్టీ అధినేత అరవింద్​ కేజ్రీవాల్ తెలిపారు.

"8 ఏళ్లలో ఆప్​ పార్టీ దిల్లీలో మూడు సార్లు అధికారంలోకి వచ్చింది. పంజాబ్​లో ప్రధాన ప్రతిపక్షంగా పనిచేసింది. రానున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాం. దిల్లీలో ఉన్న చాలామంది యూపీ ప్రజలు...ఉత్తర్​ప్రదేశ్​లోనూ పోటీ చేయమని మాకు సలహాలు ఇచ్చారు. ప్రస్తుత ప్రభుత్వంపై తాము అసంతృప్తితో ఉన్నామని తెలిపారు."

--అరవింద్​ కేజ్రీవాల్ , ఆమ్ఆద్మీ పార్టీ అధినేత

మరోవైపు యూపీ ఎన్నికల్లో తాము చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకోవటానికి సిద్ధంగా ఉన్నామని సమాజ్​వాదీ(ఎస్​పీ) అధినేత అఖిలేశ్​ యాదవ్ అన్నారు. మొత్తం 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో 2017 ఎన్నికల్లో భాజపా-309, ఎస్పీ-49, బీఎస్పీ-18, కాంగ్రెస్​-7 సీట్లు సాధించాయి.

ఇదీ చదవండి: 'నిరసన చేస్తే దేశద్రోహులు.. వారేమో స్నేహితులు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.