ETV Bharat / bharat

మధ్యప్రదేశ్​: రెండు కార్లు ఢీ.. ఆరుగురి మృతి

author img

By

Published : Oct 29, 2019, 11:08 AM IST

Updated : Oct 29, 2019, 1:00 PM IST

మధ్యప్రదేశ్​ ఇండోర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు ఢీకొని ఆరుగురు మృతి చెందారు. మరో నలుగురు చికిత్స పొందుతున్నారు.

రెండు కార్లు ఢీ.. ఆరుగురు మృతి!

మధ్యప్రదేశ్​లో ఘోర ప్రమాదం.. రెండు కార్లు ఢీ..
మధ్యప్రదేశ్ ఇండోర్​లోని తేజాజీ నగర్ పోలీస్ స్టేషన్ సమీపంలో రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాదం జరిగిన అనంతరం.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించారు. మృతులు ఇండోర్​, ఉత్తర్​ప్రదేశ్​లకు చెందిన వారిగా గుర్తించారు. వీరిలో ఒక ఆర్మీ అధికారి కూడా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

జాతీయ రహదారులపై ప్రమాదాలు పెరుగుతున్నాయని, పదుల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని వాపోతున్నారు అక్కడి జనం. ఈ నేపథ్యంలో ప్రమాదాలను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు అక్కడి జనం.

ఇదీ చూడండి:ఆటోను తప్పించబోయి.. కాలువలోకి దూసుకెళ్లిన కారు..!

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Oct 29, 2019, 1:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.