ETV Bharat / bharat

కర్ణాటకలో కరోనా ఉద్ధృతి.. 6,670 కేసులు, 101 మరణాలు

author img

By

Published : Aug 7, 2020, 10:10 PM IST

కరోనా మహమ్మారితో వివిధ రాష్ట్రాల్లో తీవ్ర పరిస్థితులు నెలకొన్నాయి. కర్ణాటకలో ఇవాళ ఆరున్నర వేల కొత్త కేసులు రాగా.. వంద మందికిపైగా మరణించారు. అటు మహారాష్ట్రలో 10 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి.

CORONA
కర్ణాటకలో కరోనా ఉద్ధృతి

దేశంలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది. పలు రాష్ట్రాల్లో కొత్త కేసుల్లో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. కర్ణాటకలో ఇవాళ కొత్తగా 6,670 మందికి వైరస్​ సోకింది. 101 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1,64,924కు చేరింది. ఇప్పటి వరకు 2,998 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ 3,951 మంది వైరస్​ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. కొత్త కేసుల్లో బెంగళూరులోనే 2,147 కేసులు వచ్చాయి.

మహాలో 10వేలకుపైగా..

మహారాష్ట్రలో వైరస్​ విజృంభణ కొనసాగుతోంది. ఇవాళ కొత్తగా 10,483 కేసులు, 300 మరణాలు నమోదయ్యాయి. ఇదే సమయంలో 10,906 మంది వైరస్​ నుంచి కోలుకోవటం ఊరట నిచ్చే విషయం.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 4,90,262కు చేరింది. 17,092 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 3,27,281 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.

బంగాల్​లో..

బంగాల్​లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇవాళ మరో 2,912 మందికి వైరస్​ సోకగా.. 52 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 89,666, మరణాలు 1,954కు చేరాయి.

ఇదీ చూడండి: అమెరికాలో 50 లక్షలు దాటిన కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.