ETV Bharat / bharat

తమిళనాట ఒక్కరోజే 4,985 కరోనా కేసులు

author img

By

Published : Jul 20, 2020, 6:56 PM IST

తమిళనాడులో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఒక్క రోజులో సుమారు 5 వేల కేసులు నమోదు కాగా.. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో మొత్తం 2,500 మందికి పైగా మరణించారు.

4,985 new COVID19 positive cases and 70 deaths have been reported in Tamil Nadu
తమిళనాట కరోనా విలయం.. నేడు 4,985 కేసులు నమోదు

తమిళనాడులో కరోనా వైరస్​ ఉగ్రరూపం దాలుస్తోంది. ఒక్కరోజు వ్యవధిలో కొత్తగా 4,985 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఫలితంగా మొత్తం వైరస్​ బాధితుల సంఖ్య 1,75,678 కు చేరింది. మరో 70 మంది మహమ్మారి ధాటికి ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మృతుల సంఖ్య 2,551 కు పెరిగింది. కొత్తగా మరో 3,861 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో 1,21,776 మందికి వైరస్​ నయమైంది.

ఆ రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 52,087 మందికి వైరస్​ పరీక్షలు నిర్వహించారు. దీంతో మొత్తం టెస్ట్​ల సంఖ్య 20 లక్షలకు చేరువైంది.

దిల్లీలో కేసులు ఇలా..

దేశ రాజధాని దిల్లీలో 24 గంటల వ్యవధిలో 954మందికి కరోనా సోకింది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 1,23,747 కు చేరింది. మరో 35 మంది వైరస్​ బారినపడి ప్రాణాలు కోల్పోగా.. మరణాల సంఖ్య 3,663 కు పెరిగింది. నేడు 1,784 మందికి వైరస్​ నయం కాగా.. మొత్తంగా 1,04,918 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.

ఇదీ చదవండి: పేడ కొనే పనిలో ప్రభుత్వం- కిలో రూ.2

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.