ETV Bharat / bharat

మహారాష్ట్రలో మరో 7,975 కేసులు.. 233 మరణాలు

author img

By

Published : Jul 15, 2020, 7:16 PM IST

Updated : Jul 15, 2020, 9:42 PM IST

4,496 new #COVID19 positive cases and 68 deaths have been reported in Tamil Nadu today
తమిళనాడు, కర్ణాటకల్లో రికార్డు స్థాయి కేసులు

19:10 July 15

తమిళనాడు, కర్ణాటకల్లో రికార్డు స్థాయి కేసులు

దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మహారాష్ట్రలో వైరస్​ వ్యాప్తి ఏ మాత్రం తగ్గడం లేదు. తమిళనాడు, కర్ణాటకల్లోనూ రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయి.

మహారాష్ట్రలో కొత్తగా 7 వేల 975 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 75 వేలు దాటింది. మరో 233 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణాల సంఖ్య 10 వేల 928కి చేరింది.

లక్ష దాటిన రికవరీలు..

తమిళనాడులో ఇవాళ 4,496 మందికి వైరస్​ సోకింది. మరో 68 మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 2167కు చేరింది. కేసులు లక్షా 50 వేలు దాటాయి.

అయితే.. ఈ రాష్ట్రంలో బాధితులు వేగంగా కోలుకుంటున్నారు. ఇవాళ ఒక్కరోజే 5000 మంది డిశ్చార్జి అయ్యారు. మొత్తం కోలుకున్న వారి సంఖ్య లక్ష దాటింది. తమిళనాడులో ఇప్పటివరకు 17 లక్షల 36 వేలకుపైగా టెస్టులు చేశారు. 

మిగతా రాష్ట్రాల్లో...

  • కర్ణాటకలోనూ కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. బుధవారం మరో 3,176 మంది కొవిడ్​ బారినపడ్డారు. రాష్ట్రంలో ఒక్కరోజే 87 మరణాలు నమోదయ్యాయి.
  • కేరళలో ఇవాళ 623 మందికి కరోనా సోకింది. మొత్తం కేసులు 10 వేలకు చేరువయ్యాయి.
  • దిల్లీలో 1647 కేసులు, 41 మరణాలు నమోదయ్యాయి.
  • బంగాల్​లో ఒక్కరోజే 1589 మందికి వైరస్​ సోకింది. మరో 20 మంది చనిపోయారు.
  • గుజరాత్​లో 925 కొత్త కేసులు వెలుగుచూసాయి. ఒక్కరోజులో 10 మరణాలు నమోదయ్యాయి.
Last Updated : Jul 15, 2020, 9:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.