ETV Bharat / bharat

యువతి నగ్న వీడియోలు తీసి.. కోరిక తీర్చాలని బెదిరింపులు.. మైనర్​ గర్భిణి మృతి.. నిందితుడికి జీవిత ఖైదు

author img

By

Published : Dec 10, 2022, 12:29 PM IST

minor girlfriend dies
minor girlfriend dies

కర్ణాటకలో దారుణం జరిగింది. ఓ యువతి రహస్య వీడియోలు తీసి బెదిరించాడు ఓ వ్యక్తి. తన కోరిక తీర్చాలని వేధిస్తున్నాడు. మరో ఘటనలో మైనర్​ గర్భవతి మరణానికి కారణమైన ఓ వ్యక్తికి.. కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ ఘటన ఛత్తీస్​గఢ్​లో జరిగింది.

రహస్యంగా ఓ యువతి వీడియోలు తీసి వేధిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన కర్ణాటకలోని బెంగుళూరులో జరిగింది. నిరంజన్​ అనే వ్యక్తి 4 ఏళ్ల నుంచి హెచ్​ఎస్​ఆర్​ లే అవుట్​లో పేయింగ్​ గెస్ట్​గా ఉంటున్నాడు. అతడు డ్రగ్స్​, మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో స్థానికంగా ఉండే ఓ యువతిపై కన్నేశాడు. ఆమె బాత్​రూంలో రహస్య కెమెరా పెట్టి.. నగ్న వీడియోలు చిత్రీకరించాడు.

అనంతరం తన నంబర్​ తెలియకుండా ఫారిన్ నంబర్​తో మెసెజ్​లు, కాల్స్​ చేసే ఓ యాప్​ను​ ఇన్​స్టాల్​ చేసుకున్నాడు. ఆ ఫారిన్​ నంబర్​ నుంచి యువతికి ఆ వీడియోలు పంపించాడు. తనతో శృంగారంలో పాల్గొనకపోతే యువతి నగ్న వీడియోలు పోర్న్ వెబ్​సైట్లలో అప్​లోడ్​ చేస్తానని బ్లాక్​మెయిల్​ చేశాడు. దీంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు. విచారణలో నిందితుడి ఫోన్లో మరో మూడు వీడియోలు లభించాయి. ఇలా.. నిందితుడు ఇంకెవరినైనా బ్లాక్​మెయిల్​ చేశాడా అనే కోణంలోనూ దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

అబార్షన్​ మందులతో మైనర్​ మృతి..
ఓ మైనర్​ గర్భవతి మరణానికి కారణమైన వ్యక్తికి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ కోర్డు తీర్పు వెలువరించింది. ఈ ఘటన ఛత్తీస్​గఢ్​లో జరిగింది. పెంద్రా పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఓ గ్రామంలో ఒక బాలిక నివసిస్తోంది. అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి.. బాలికను ప్రేమిస్తున్నాని చెప్పి ఆమెను శారీరకంగా వాడుకున్నాడు. దీంతో బాలిక గర్భం దాల్చింది. కాగా, విషయం బయటపడకుండా ఉండేందుకు అబార్షన్​ అయ్యే మందులను 5 నెలల గర్భంతో ఉన్న బాలికకు ఇవ్వగా.. బాలిక చనిపోయింది.

దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. బాలిక వివరాలను సేకరించారు. బాలిక చనిపోయే నాటికి ఆమె వయసు 15 ఏళ్ల 9 నెలలుగా ఉందని నిర్ధరించారు. అనంతరం పోక్సో చట్టం కింద కేసు మార్చి.. నిందితుడిని అరెస్టు చేశారు. అనంతరం కోర్టు.. నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. రూ. 1000 జరిమానా విధించింది. అయితే, నిందితుడు బాలికను చంపాలనే ఉద్దేశంతో ఆ మందులు ఇవ్వలేదని.. గర్భవిచ్ఛిత్తి చేయడానికి మాత్రమే ఇచ్చాడని వ్యాఖ్యానించింది.

బాలుడ్ని బ్లాక్​మెయిల్​ చేసి.. రూ.31 లక్షలు స్వాహా..!
మధ్యప్రదేశ్​లో ఓ బాలుడ్ని ట్రాప్​ చేసి దాదాపు రూ. 31 లక్షల నగదు, బంగారు, వెండి ఆభరణాలు దోచుకున్నారు. బాలుడి కుటుంబ సభ్యులు ఇంట్లో చూడగా.. నగదు ఆభరణాలు కనిపించలేదు. అనంతరం వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఏం జరిగిందంటే.. గ్వాలియర్​ జిల్లా బీలావా టౌన్​కు చెందిన ఓ వ్యక్తి 11 ఏళ్ల క్రితం తన సోదరి కుమారుడ్ని దత్తత తీసుకున్నాడు. ఇప్పుడు అతడి వయసు 12 సంవత్సరాలు. కాగా, ఆ బాలుడు పాలు తీసుకురావడానికి మదన్​ శర్మ అనే వ్యక్తి వద్దకు వెళ్లేవాడు. అలా మదన్​ శర్మ పిల్లలతో స్నేహం చేశాడు. దీన్ని అదునుగా భావించిన మదన్​ శర్మ.. బాలుడ్ని మచ్చిక చేసుకుని అతడికి బీర్​ తాగడం, బైక్​, కార్లపై షికారు తిరగడం అలవాటు చేశాడు. అలా మే 22న బాలుడిని పిస్తోల్​తో బెదిరించి మద్యం తాగించాడు. ఆపై బాలుడి దుస్తులు తీసేసి నగ్నంగా వీడియోలు, ఫొటోలు తీశాడు.

తాను చెప్పినట్లు చేయకపోతే వీడియోలు, ఫొటోలు అందరికీ చూపిస్తానని బాలుడ్ని బ్లాక్​మెయిల్​ చేశాడు. దీంతో ఆ మైనర్​.. మదన్​ శర్మ చెప్పినట్టు చేశాడు. మదన్​ అడిగినంత నగదు, బంగారు, వెండి ఆభరణాలు తీసుకొచ్చాడు. అక్కడితో ఆగకుండా మరి కొందరికి బాలుడి వీడియోలు పంపించాడు. వాళ్లు కూడా బాలుడ్ని బ్లాక్​మెయిల్​ చేయడం మొదలుపెట్టారు. అలా 5 నెలలుగా నగదు, ఆభరణాలు కలిపి మొత్తం రూ. 31 లక్షల వరకు దోచుకున్నారు. కాగా, ఈ విషయం తెలిసిన బాధితుడు.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.