ETV Bharat / bharat

Assam CM Wife Scam : 'సీఎం భార్యకు రూ.10 కోట్ల రాయితీ'.. కాంగ్రెస్ ఆరోపణలు.. ఖండించిన హిమంత.. ట్విట్టర్​ వార్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 14, 2023, 7:28 AM IST

Assam CM Wife Scam : అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ భార్యకు చెందిన కంపెనీ కేంద్రం నుంచి రుణ ఆధారిత రాయితీ పొందిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అందుకు సంబంధించిన వివరాలను ఎక్స్(ట్విట్టర్​)​లో పోస్ట్ చేశారు. ఈ ఆరోపణలను హిమంత బిశ్వశర్మ ఖండించారు.

Assam CM Wife Scam
Assam CM Wife Scam

Assam CM Wife Scam : అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. ఆయన భార్య రినికి భుయాన్ శర్మకు చెందిన కంపెనీ భూములు కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి రుణ ఆధారిత రాయితీ పొందారని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ నేతలు ఎక్స్​(ట్విట్టర్​)లో ట్వీట్‌ చేశారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ మంత్రిత్వశాఖ వెబ్‌సైట్ ప్రకారం.. సీఎం హిమంత బిశ్వశర్మ భార్య రినికి భుయాన్‌ శర్మ సంస్థ ప్రైడ్‌ ఈస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.10 కోట్ల మేర రుణ ఆధారిత రాయితీ పొందిందని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్​ గొగొయ్ ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. ఈ ఆరోపణలను అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఖండించారు. 'నా భార్య, ఆమె కంపెనీ భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక రాయితీ పొందలేదు' అని ట్వీట్‌ చేశారు.

  • PM Modi launched the Kisan Sampada scheme to double the income of farmers of India. But in Assam Chief Minister Himanta Biswa Sarma used his influence to help his wife’s firm get Rs 10 crore as part of credit linked subsidy. Are Central government schemes meant to enrich BJP ? pic.twitter.com/ITqzrBCe4c

    — Gaurav Gogoi (@GauravGogoiAsm) September 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Adarnya Pradhan Mantri Modi, your government has given Rs 10 crore subsidy to a private company run by the wife of Chief Minister Himanta Biswa’s wife. Is this revdi or rabri ? Is this why people are paying tax ? https://t.co/BzfgTXtn5N

    — Gaurav Gogoi (@GauravGogoiAsm) September 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Assam CM Wife 10 Crore : అసోం సీఎం సమాధానంతో గౌరవ్ గొగొయ్ సంతృప్తి చెందలేదు. కేంద్ర మంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌లో రినికి భుయాన్‌ పేరు, కంపెనీ పేరు స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. కేంద్రం నుంచి రూ.10 కోట్ల సబ్సిడీ పొందిన కంపెనీలు, ప్రమోటర్ల జాబితాను సూచించే వెబ్‌సైట్ లింకును ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దానిపై స్పందించిన హిమంత బిశ్వ శర్మ.. మునుపటి ఖండననే పునరుద్ఘాటిస్తున్నానని అన్నారు. కాగా.. వెబ్‌సైట్‌లో పొందుపరిచిన పత్రాల గురించి ఆయన ప్రస్తావించవించలేదు.

  • The Ministry of Food Processing website clearly shows the name of the person and the company she is associated with. The Rs 10 crore government grant has also been approved. Please report to the Union Minister if their website has been hacked. https://t.co/INLdu603Kh

    — Gaurav Gogoi (@GauravGogoiAsm) September 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • For the convenience of the Hon’ble Chief Minister I am attaching the link to the website of the Ministry of Food Processing. It shows the list of companies and promoters who have received the Rs 10 crore government subsidy. Please see serial 10.https://t.co/rR2m9PH8DX https://t.co/O9krRaDSRW

    — Gaurav Gogoi (@GauravGogoiAsm) September 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

హిమంత భార్య కంపెనీ గురించి ఆదివారం ఓ వెబ్‌సైట్‌ కథనం ప్రచురించింది. 'ప్రైడ్‌ ఈస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌'లో రినికి భూయాన్‌కు మెజారిటీ వాటా ఉంది. 2022 ఫిబ్రవరిలో ఆ కంపెనీ కలియాబోర్‌ మౌజాలో 10 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేసింది. అసోం సీఎంగా హిమంత బిశ్వ శర్మ బాధ్యతలు స్వీకరించిన 9 నెలల తరువాత ఈ కొనుగోలు జరిగింది. నెల రోజుల్లోనే ఆ వ్యవసాయ భూమిని ఇండస్ట్రీయల్ కారిడార్​గా మార్చారు. ఆ తరువాత ప్రైడ్‌ ఈస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అందులో ఫుడ్ ప్రాసెసింగ్‌ యూనిట్ ఏర్పాటు చేస్తుందని పీఎం కిసాన్‌ సంపద యోజన కింద సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకుంది. ఆ వివరాల ఆధారంగా కేంద్ర ఫుడ్‌ ప్రాసెసింగ్‌ మంత్రిత్వశాఖ 2022 నవంబర్‌ 10న సంబంధిత కంపెనీకి రూ.10 కోట్ల సబ్సిడీ ఇవ్వడానికి అంగీకరించింది' అని కథనంలో వెల్లడించింది.

అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ భార్యకు ప్రైడ్‌ ఈస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో ఉన్న హోదా, వాటాల గురించి వివరాల స్క్రీన్‌షాట్లను కాంగ్రెస్‌ మీడియా, ప్రచార విభాగం అధ్యక్షుడు పవన్‌ ఖేడా ట్విట్టర్​లో పోస్ట్ చేశారు. 'ప్రియమైన హిమంత బిశ్వ.. మీరు ఇంకా తిరస్కరిస్తారా?' అని ఆయన అన్నారు. ఈ క్రమంలో తన భార్య కంపెనీ.. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనాలు పొందలేదని హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఖేడా 'అయితే మీరు అసోం పోలీసులను పంపించి ఫుడ్ ప్రాసెసింగ్‌ మంత్రిని అరెస్టు చేయిస్తారా?' అని ప్రశ్నించారు. పవన్​ ఖేడాను ఈ ఏడాది ఫిబ్రవరిలో అసోం పోలీసులు అరెస్టు చేసి.. ఆ తరువాత బెయిల్‌పై విడుదల చేశారు. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ ఖేడా వ్యంగ్యంగా స్పందించారు.

ఉపముఖ్యమంత్రిపై సీఎం భార్య రూ.100కోట్ల పరువు నష్టం దావా

అసోం సీఎంకు 'జెడ్ ప్లస్'​ సెక్యూరిటీ.. కారణం అదేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.