ETV Bharat / bharat

పాఠశాల విద్యార్థుల పడవ బోల్తా.. అనేక మంది గల్లంతు

author img

By

Published : Sep 29, 2022, 2:07 PM IST

Assam Boat Capsize
Assam Boat Capsize

Assam Boat Capsize : పాఠశాల విద్యార్థులతో ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది. ఈ దుర్ఘటన అసోం ధుబ్రి జిల్లాలోని బ్రహ్మపుత్ర నదిలో జరిగింది. ప్రమాద సమయంలో ఓ ప్రభుత్వ అధికారి సహా 100 మంది ప్రయాణికులు, 10 మోటార్​ సైకిళ్లు ఉన్నట్లు స్థానికులు తెలిపారు.

Assam Boat Capsize : అసోంలో ఘోర ప్రమాదం జరిగింది. పాఠశాల విద్యార్థులతో ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది. ఈ దుర్ఘటన ధుబ్రి జిల్లాలోని బ్రహ్మపుత్ర నదిలో జరిగింది. ప్రమాద సమయంలో ఓ ప్రభుత్వ అధికారి సహా 100 మంది ప్రయాణికులు, 10 మోటార్​ సైకిళ్లు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. అయితే.. పడవలో 30 మంది ప్రయాణికులు ఉన్నారని.. ఏడుగురు గల్లంతయ్యారని ధుబ్రి డిప్యూటీ కమిషనర్​ వెల్లడించారు.

Assam Boat Capsize
సహాయక చర్యలు చేపట్టిన అధికారులు

ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 15 మందిని రక్షించామని అధికారులు చెప్పారు. సర్వేకు వెళ్లిన ఓ ప్రభుత్వ అధికారి సహా విద్యార్థుల ఆచూకీ లభించలేదని పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.