ETV Bharat / bharat

దిల్లీ జంతర్​మంతర్​ వద్ద రైతుల నిరసన

author img

By

Published : Jul 22, 2021, 8:34 AM IST

Updated : Jul 22, 2021, 1:16 PM IST

Farmers protest,
నేటి నుంచి జంతర్​మంతర్​ వద్ద రైతు నిరనసలు

12:15 July 22

జంతర్​మంతర్​కు చేరిన రైతులు

  • Buses, carrying farmers, arrive at Jantar Mantar in Delhi. The protesting farmers will agitate against Central Government's three farm laws here. pic.twitter.com/ru3WfYa63p

    — ANI (@ANI) July 22, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

పార్లమెంటు సమవేశాల నేపథ్యంలో రైతు సంఘాలు సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలోని జంతర్​మంతర్​ వద్ద గురువారం నిరసన చేపట్టాయి. బీకేయూ నేత రాకేశ్​ టికాయిత్​ ఆధ్వర్యంలో రైతు నేతలు ఆందోళనలు నిర్వహించారు. సంయుక్త కిసాన్​ మోర్చా నుంచి 200 మంది.. కిసాన్​ సంఘర్ష్​ కమిటీ నుంచి ఆరుగురు రైతులు ధర్నాలో పాల్గొన్నారు. వీరంతా సింఘూ సరిహద్దు నుంచి ప్రత్యేక బస్సుల్లో రైతులు జంతర్​మంతర్​ చేరుకున్నారు. 

రైతు నిరసనలకు మద్దతుగా కాంగ్రెస్​, అకాలీదళ్​కు చెందిన ఎంపీలు పార్లమెంటు ఆవరణలో నిరసన చేపట్టారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందే అని డిమాండ్​ చేశారు.

రైతు నేతల నిరసనలకు దిల్లీ పోలీసులు.. ఉదయం 11 నుంచి సాయంత్రం 6 వరకు అనుమతించారు. గురువారం మొదలుకొని పార్లమెంటు సమావేశాలు ముగిసేవరకు రైతు నేతలు ప్రతిరోజు ఈ నిరసనలు కొనసాగిస్తారు.

12:01 July 22

  • Delhi: Shiromani Akali Dal (SAD) MPs protest over the three farm laws and show placards to Agriculture Minister Narendra Singh Tomar at the Parliament premises. pic.twitter.com/5E0ILvp0Tb

    — ANI (@ANI) July 22, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

శిరోమణి అకాలీ దళ్ నేతల నిరసన​ 

రైతులకు మద్దతుగా శిరోమణి అకాలీ దళ్​ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో ధర్నా చేపట్టారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​కు ప్లకార్డులు చూపిస్తూ నిరసన వ్యక్తం చేశారు.  

11:12 July 22

  • Delhi: Congress leader Rahul Gandhi staged a protest along with party MPs in front of Gandhi Statue, over three farm laws pic.twitter.com/8SEdgOkLWn

    — ANI (@ANI) July 22, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రైతులకు రాహుల్​ మద్దతు

పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ సహా పంజాబ్​కు చెందిన ఆ పార్టీ​ ఎంపీలు రైతులకు మద్దతుగా ధర్నా చేపట్టారు. సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్​ చేశారు.  

హింసకు పాల్పడటానికి తాము దుండగులం కాదన్నారు రైతు నేత రాకేశ్​ టికాయిత్. జనవరి 26న జరిగిన హింస నేపథ్యంలో మరోసారి అలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు చేపడుతున్నారని మీడియా అడిగిన ప్రశ్నకు ఈ విధంగా స్పందించారు.    

09:40 July 22

సింఘూ సరిహద్దు నుంచి బయలుదేరిన రైతులు

  • Farmers gather to board the buses at Singhu (Delhi-Haryana) border, ahead of protest against three farm laws at Jantar Mantar in Delhi pic.twitter.com/S4JFHt6lv4

    — ANI (@ANI) July 22, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

బయలుదేరిన రైతులు..

పార్లమెంటు వద్ద నిరసన తెలిపేందుకు సింఘూ సరిహద్దు నుంచి రైతులు బయలుదేరారు. ప్రత్యేక బస్సుల్లో 200 మంది రైతులు జంతర్​మంతర్​కు చేరుకోనున్నారు. 

08:35 July 22

జంతర్​మంతర్​కు బయలుదేరిన రాకేశ్​ టికాయిత్

రైతు సంఘం నేత రాకేశ్​ టికాయిత్​ మరో ఏడుగురు రైతులతో సింఘూ సరిహద్దు నుంచి బయలు దేరారు. 

జంతర్ మంతర్ వద్ద కిసాన్ పార్లమెంట్ నిర్వహిస్తామని టికాయిత్​ పేర్కొన్నారు. 

08:07 July 22

పార్లమెంటు వద్ద రైతు నిరసనలు

  • Delhi: Security tightens at Jantar Mantar ahead of a farmers' protest against three farm laws amid monsoon session of Parliament pic.twitter.com/RhtVRJnCk9

    — ANI (@ANI) July 22, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా నేడు రైతు సంఘాలు జంతర్​మంతర్​ వద్ద నిరసన తెలపనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో​ భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు.  

సమావేశాలు ముగిసేవరకు రోజూ ఉదయం 11 నుంచి సాయంత్రం 5 వరకు రైతులు ధర్నా చేపడతారు. ఈ నిరసనల్లో ప్రతిరోజు 200 మంది రైతులు పాల్గొంటారు. 

Last Updated :Jul 22, 2021, 1:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.