ETV Bharat / bharat

సరిహద్దులో పాక్ డ్రోన్ సంచారం- బీఎస్ఎఫ్ కాల్పులు

author img

By

Published : Nov 18, 2021, 5:25 AM IST

పాకిస్థాన్​కు చెందిన డ్రోన్​.. భారత్​ గగనతలంలోకి ప్రవేశించడం కలకలం రేపింది. పంజాబ్ అమృత్​సర్​ జిల్లాలో చక్కర్లు కొడుతున్న పాక్​ డ్రోన్​పై భద్రతా సిబ్బంది కాల్పులు జరిపింది. దీంతో డ్రోన్​ వెనక్కువెళ్లిపోయినట్లు అధికారులు తెలిపారు.

Another Pakistani drone spotted in Amritsar, Punjab
సరిహద్దులో పాక్ డ్రోన్ సంచారం

పంజాబ్​లోని నియంత్రణ రేఖ వెంబడి డ్రోన్​ను(India Pak border) గుర్తించింది భద్రతా సిబ్బంది. ఆ డ్రోన్​పై (drone spotted) కాల్పులు జరిపింది. దీంతో అవి తిరిగి పాక్​వైపు వెళ్లిపోయినట్లు అధికారులు తెలిపారు.

అమృత్​సర్​ జిల్లాలోని బిందీ సైదాన్ గ్రామంలో డ్రోన్​ను గుర్తించింది భద్రతా సిబ్బంది. భారత భూభాగంలోకి ప్రవేశించిన డ్రోన్​.. ఏమైనా పేలుడు పదార్థాలను కిందకు విడిచాయా? అన్నకోణంలో పంజాబ్​పోలీసులు, భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.

గతంలోనూ పంజాబ్‌లోని భారత్‌-పాకిస్థాన్‌ (Ind Pak border) సరిహద్దుల్లో డ్రోన్లు కలకలం రేపాయి. గత కొన్నినెలలుగా సరిహద్దుల్లో డ్రోన్​లు సంచరించటం వల్ల హై అలర్ట్‌ ప్రకటించారు అధికారులు.

ఇదీ చూడండి: ఐసిస్​​ ఉగ్రవాదిని దోషిగా తేల్చిన ఎన్​ఐఏ కోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.