ETV Bharat / bharat

యూపీపై ఎంఐఎం గురి- 100 సీట్లలో పోటీ

author img

By

Published : Jun 27, 2021, 6:23 PM IST

Updated : Jun 27, 2021, 6:56 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు మజ్లిస్​ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. అక్కడి చిన్న పార్టీలతో కలిసి పనిచేస్తామని వెల్లడించారు.

AIMIM to contest Uttar Pradesh
యూపీపై ఎంఐఎం

బిహార్​ ఎన్నికల్లో రాణించిన తర్వాత ఆల్​ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ జోరు​ పెంచింది. ఉత్తర్​ప్రదేశ్​లో 2022లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లలో పోటీచేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్ధీన్ ఒవైసీ ప్రకటించారు. షెడ్యూల్డ్ భారతీయ సమాజ్​ వాదీ (ఎస్​బీఎస్​పీ), చిన్న పార్టీల కూటమైన భాగీదార్​ సంకల్ప్​ మోర్చాతో కలిసి పనిచేస్తామని తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు.

"ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికల్లో 100 సీట్లలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించాం. అప్లికేషన్​ ఫాంలను కూడా రిలీజ్​ చేశాం."

-అసదుద్ధీన్ ఓవైసీ, ఏఐఎంఐఎం అధ్యక్షుడు

గత ఏడాది జరిగిన బిహార్​ ఎన్నికల్లో మజ్లిస్​ పార్టీ 20 చోట్ల పోటీ చేసి ఐదు సీట్లు గెలుచుకుంది.

ఇవీ చదవండి:యూపీ బరిలో మజ్లిస్- ఏ పార్టీకి నష్టం?

'యూపీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ'

Last Updated :Jun 27, 2021, 6:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.