ETV Bharat / bharat

'ఓవైసీ ప్రధాని కావాలంటే.. మీరంతా ఎక్కువ మంది పిల్లల్ని కనాల్సిందే!'

author img

By

Published : Dec 16, 2021, 5:11 PM IST

AIMIM party in up: అసదుద్దీన్​ ఓవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం పార్టీకి చెందిన ఓ నాయకుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓవైసీని ప్రధానిగా చూడాలంటే ఎక్కువ మంది పిల్లలను కనాలని ముస్లింలకు ఉచిత సలహా ఇచ్చారు. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

Asasuddin Owaisi
అసదుద్దీన్​ ఓవైసీ

AIMIM party in up: ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అన్ని పార్టీలు రాత్రింబవళ్లు కష్టపడుతున్నాయి. ఆల్​ ఇండియా మజ్లిస్​​ ఈ ఇత్తెహాదుల్​ ముస్లిమీన్​(ఏఐఎం​ఐఎం​) అధినేత అసదుద్దీన్​ ఓవైసీ సైతం.. యూపీలో పాగా వేయాలని చూస్తున్నారు. సమావేశాలు నిర్వహిస్తూ ముస్లిం సమాజాన్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏఐఎంఐఎంకి చెందిన ఓ జిల్లా అధ్యక్షుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఆ వీడియోలో.. ఓవైసీని ప్రధాన మంత్రి చేసేందుకు ముస్లింలు ఎక్కువ మంది పిల్లలను కనాలని సలహా ఇచ్చారు.

వీడియోలో మాట్లాడుతున్న ఏఐఎంఐఎం పార్టీ జిల్లా అధ్యక్షుడు

ఏఐఎంఐఎం అలీగఢ్​ జిల్లా అధ్యక్షుడు గుఫ్రాన్​ నూర్​ ఆ వీడియోలో మాట్లాడుతున్నారు.' పిల్లలు లేకపోతే మనం రాజ్యాధికారం ఎలా సాధిస్తాం? ఓవైసీ సాబ్​ ఎలా ప్రధాని అవుతారు. శైకత్​ సాబ్​ ఎలా ముఖ్యమంత్రి అవుతారు? దళితులు, ముస్లింలు ఎక్కువ మంది పిల్లలను కనకూడదని కట్టడి చేస్తున్నారు. అలా ఎందుకు? అది షరియత్​కు వ్యతిరేకం.' అని పేర్కొన్నారు. ఈ వీడియో బుధవారం రికార్డ్​ చేసినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: యూపీలో పాగా కోసం మజ్లిస్ ఆరాటం.. వంద సీట్లలో పోటీ

యూపీలో ఒంటరైన ఒవైసీ.. యోగి పరోక్ష మద్దతు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.