ETV Bharat / bharat

ఏరోఇండియా షో- 'తేజస్​' ఒప్పందంపై సంతకాలు

author img

By

Published : Feb 3, 2021, 10:24 AM IST

Updated : Feb 3, 2021, 10:34 AM IST

ఏరో ఇండియా 2021 కార్యక్రమాన్ని రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ ప్రారంభించారు. ఇందులో భాగంగా.. తేజస్ యుద్ధ విమానాలకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్​తో ఒప్పందం కుదుర్చుకున్నారు. రక్షణ, ఎరోస్పేస్​ రంగాల్లో భాగస్వామ్యం పెంపొందించుకోవడానికి ఏరో ఇండియా కార్యక్రమం అద్భుతమైన వేదికగా నిలుస్తోందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.

Aero India takes off on Feb 3 amidst Covid, buzz around 'Aatmanirbhar Bharat'
ఏరో ఇండియా: హిందుస్థాన్​కు తేజస్ కాంట్రాక్ట్

బెంగళూరు వేదికగా ఏరో ఇండియా 2021 కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ నెల 5 వరకు కొనసాగనున్న ఎయిర్​ షోను రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​, కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రారంభించారు. యలహంకలోని ఎయిర్​ఫోర్స్​ స్టేషన్​లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

కార్యక్రమంలో భాగంగా.. 83 'తేజస్' విమానాల కొనుగోలు కాంట్రాక్టును హిందుస్థాన్​ ఏరోనాటిక్స్​ లిమిటెడ్​(హాల్)కు లాంఛనంగా అప్పగించింది కేంద్రం. రూ. 48 వేల కోట్ల విలువైన ఈ ఒప్పందంపై.. రక్షణ శాఖ, హాల్​ అధికారులు సంతకాలు చేశారు.

ప్రారంభోత్సవం సందర్భంగా హెలికాప్టర్ల చక్కర్లు

అద్భుత వేదిక

ఈ సందర్భంగా ట్వీట్ చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. రక్షణ, ఏరోస్పేస్ రంగంలో భారత్​ అనేక అవకాశాలు అందిస్తోందని అన్నారు. ఈ రంగాల్లో భాగస్వామ్యం పెంపొందించుకోవడానికి ఏరో ఇండియా అద్భుతమైన వేదికగా నిలుస్తోందని పేర్కొన్నారు. భారత ప్రభుత్వం ఈ రంగాల్లో విప్లవాత్మకమైన సంస్కరణలు తీసుకొచ్చిందని చెప్పారు. దేశం ఆత్మనిర్భర్​ భారత్​గా మారేందుకు ఇవి దోహదం చేస్తాయని స్పష్టం చేశారు.

Last Updated : Feb 3, 2021, 10:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.