ETV Bharat / bharat

8వ అంతస్తు పిట్టగోడపై కూర్చొని రోగి హల్​చల్​.. చివరకు కిందపడి..

author img

By

Published : Jun 25, 2022, 2:01 PM IST

Updated : Jun 25, 2022, 4:38 PM IST

A PATIENT GOES DOWN IN CORNICE OF INSTITUTE
A PATIENT GOES DOWN IN CORNICE OF INSTITUTE

బంగాల్​లో ఓ రోగి విచిత్రంగా ప్రవర్తించి హల్​చల్​ చేసి చివరకు మృతి చెందాడు. ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ న్యూరోసైన్స్​ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడు.. శనివారం భవనంలోని 8వ అంతస్తు అంచున కూర్చుని కనిపించాడు. కిందకు దిగమంటే నిరాకరిస్తున్నాడు. దీంతో ఒక్కసారిగా అతడు కిందపడి మరణించాడని పోలీసులు తెలిపారు.

8వ అంతస్తు పిట్టగోడపై కూర్చొని రోగి హల్​చల్

బంగాల్​లోని కోల్​కతా ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ న్యూరోసైన్స్​ ఆసుపత్రిలో ఓ రోగి హల్​చల్​ చేశాడు. ఎనిమిదో అంతస్తు పిట్టగోడ అంచున కూర్చొని రెండు గంటలకుపైగా హడావుడి చేశాడు. శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో అతడు కింద పడి మరణించాడు. అయితే అతడు కింద పడతాడని ముందే ఊహించిన అధికారులు, ఆస్పత్రి సిబ్బంది.. భవనం బయట నెట్​ అమర్చారు. కానీ అతడు మాత్రం నేలపై పడి తీవ్రంగా గాయాలపాలై మృతి చెందాడు.

రోగి
రోగి

అంతకుముందు.. విచిత్రంగా ప్రవర్తిస్తున్న ఈ రోగిని గుర్తించిన ఆస్పత్రి సిబ్బంది అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది నిచ్చెనతో అతడిని చేరుకోవడానికి ప్రయత్నించారు. అయినా అతడు కిందకు దిగడానికి నిరాకరించాడు. అక్కడే ఉంటానని చెప్పాడు. దగ్గరికి వస్తే దూకేస్తానంటూ వీరంగం సృష్టించాడు. ఈ ఘటన వల్ల ఆసుపత్రి రహదారిలో ట్రాఫిక్​ స్తంభించిపోయింది.

ఇవీ చదవండి: మొండెం లేని యువకుడి మృతదేహం లభ్యం.. హత్యనా? లేక ఇంకేమైనా?

స్వీపర్​కు హ్యాట్సాఫ్​.. దొరికిన వజ్రాలను యజమానికి అందజేత.. వాటి విలువ ఎంతంటే?

Last Updated :Jun 25, 2022, 4:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.